ఈసారి ఎలాగైనా పొట్టి ప్రపంచకప్ గెలిచి అభిమానుల ఎదురుచూపులకు పుల్స్టాప్ పెట్టాలని టీమిండియా భావిస్తోంది. అయితే తాజాగా వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచుల్లో ఫలితం మాత్రం ఆందోళనకరంగా వచ్చింది. తొలి ప్రాక్టీస్ మ్యాచ్లో సూర్యకుమార్ బ్యాటింగ్ మెరుపులకు బౌలర్ల సమిష్టి కృషి తోడవడంతో 13 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.
అయితే రెండో మ్యాచ్లో మాత్రం చాలా పేలవమైన బ్యాటింగ్తో 36 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ రెండు ప్రాక్టీస్ మ్యాచ్లలో కూడా కోహ్లీ ఆడలేదు. అయితే ప్రస్తుత టీమిండియాలో ఆస్ట్రేలియా గడ్డపై ఎక్కువగా ఆడి, అంత బాగా సక్సెస్ అయిన ఏకైక ఆటగాడు కోహ్లీనే కావడం గమనార్హం.
ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యాతో సుమారు 20 నిమిషాలపాటు కోహ్లీ మాట్లాడాడు. వాళ్లు ఏం మాట్లాడుకున్నారో వినిపించకపోయినా.. కోహ్లీ చేతుల కదలిక గమనిస్తే బ్యాటింగ్ గురించే ఏవో కిటుకులు చెప్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే అతను తోటి ఆటగాళ్లకు ఆస్ట్రేలియా పరిస్థితుల గురించి వివరించి చెప్తున్నట్లు కనిపిస్తోంది.