గతేడాది అర్థంతరంగా ఆగిపోయిన భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు ముగింపు పలికేందుకు టీమిండియా సిద్ధమైంది. జూలై 1 నుంచి ఆ సిరీస్లో చివరిదైన ఐదో టెస్టును ఆడేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ వెళ్లిన భారత జట్టు అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు రెండు ప్రాక్టీస్ మ్యాచులు ఆడనుంది.
దీనికోసమే లీసెస్టర్షైర్ కౌంటీ జట్టుతో గురువారం నుంచి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఇక్కడకు టీమిండియా ఆటగాళ్లు వచ్చినప్పటి నుంచి బీసీసీఐ.. తమ అధికారిక ట్విట్టర్లో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు లీసెస్టర్షైర్ ఇన్స్టా హ్యాండిల్ షేర్ చేసిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రాక్టీస్ మ్యాచ్ ముందు ట్రైనింగ్ సందర్భంగా భారత మాజీ సారధి విరాట్ కోహ్లీ.. జట్టులో ఉత్సాహం నింపేలా స్పీచ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన లీసెస్టర్షైర్ ఇన్స్టా హ్యాండిల్.. ‘‘గేమ్ మోడ్ యాక్టివేటెడ్. ప్రిపరేషన్స్ ముందు జట్టును ఉద్దేశించి విరాట్ కోహ్లీ ప్యాషనేట్ స్పీచ్’’ అని పోస్టు పెట్టింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.