Virat Kohli | ప్రపంచకప్ (World Cup) కోసం సన్నద్ధమవుతున్న టీమ్ ఇండియా (Team India) తన రెండో వామప్ మ్యాచ్ ( warm-up game ) కోసం తిరువనంతపురం (Thiruvananthapuram) చేరుకుంది. శనివారం భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన వామప్ పోరు వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో చివరిదైన రెండో మ్యాచ్ కోసం టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. రేపు తిరువనంతపురంలో ఈ మ్యాచ్ జరగనుంది. నెదర్లాండ్స్తో టీమ్ ఇండియా తలపడబోతోంది.
ఈ నేపథ్యంలో జట్టు సభ్యులంతా గువహటి నుంచి తిరువనంతపురం బయలుదేరి వెళ్లారు. అయితే, టీమ్ఇండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మాత్రం సడెన్గా ముంబై ఫ్లైట్ ఎక్కినట్లు (Flies Back To Mumbai) వార్తలు వస్తున్నాయి. వ్యక్తిగత అత్యవసర కారణాలతో బీసీసీఐ యాజమాన్యం అనుమతితో కోహ్లీ సెలవు తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అతడు తిరిగి జట్టులో ఎప్పుడు చేరుతాడన్నది మాత్రం తెలియరాలేదు.
కోహ్లీ హఠాత్తుగా సెలవు తీసుకోవడంతో పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. భార్య అనుష్క శర్మ (Anushka Sharma) రెండోసారి తల్లికాబోతోందంటూ ఇప్పటికే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దంపతులిద్దరూ ముంబైలోని ఓ గైనకాలజీ ఆసుపత్రి వద్ద కనిపించినట్టు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో అనుష్క శర్మ కోసమే కోహ్లీ సెలవు తీసుకుని అత్యవసరంగా ముంబై ఫ్లైట్ ఎక్కినట్లుగా నెటిజన్స్ చెప్పుకుంటున్నారు. కాగా, కోహ్లీ-అనుష్క దంపతులు 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక 2021లో ఈ జంటకు వామిక జన్మించింది.
Also Read..
Viral Video | యువకుడి ప్రాణం తీసిన ఇన్స్టా రీల్స్ పిచ్చి
Ileana DCruz | అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న ఇలియానా.. అప్పుడే రెండు నెలలైందంటూ పోస్ట్