Virat Kohli: వయసు మీద పడుతున్నకొద్దీ తనలోని ఫిట్నెస్ లెవల్స్ను నానాటికీ కొత్తగా పరిచయం చేస్తూ యువ ఆటగాళ్లకు సైతం సవాల్ విసురుతున్న ఆటగాడు విరాట్ కోహ్లీ. ఈ పరుగుల యంత్రం ఫీల్డ్లో ఉంటే అక్కడ్నుంచి బంతి అతడిని దాటిపోవడం అసంభవమే. దానికి రెండ్రోజుల క్రితమే అఫ్గానిస్తాన్తో బెంగళూరు వేదికగా ముగిసిన మ్యాచ్లో విరాట్ ఫీల్డ్లో చేసిన విన్యాసాలే సాక్షి. ముఖ్యంగా అఫ్గాన్ బ్యాటింగ్ చేస్తుండగా వాషింగ్టన్ సుందర్ వేసిన బంతిని ఆ జట్టు బ్యాటర్ కరీమ్ జనత్ భారీ షాట్ ఆడగా లాంగాన్లో కోహ్లీ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో బంతిని పట్టి అతడు బౌండరీ లైన్ ఆవల పడ్డా బాల్ను మాత్రం ముందుకు విసిరడంతో ఐదు పరుగులు సేవ్ అయ్యాయి. ఈ ప్రదర్శనకు గాను కోహ్లీకి మొన్నటి మ్యాచ్లో ‘బెస్ట్ ఫీల్డర్ అవార్డు’ వరించింది.
బీసీసీఐ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్.. కోహ్లీకి ‘ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును ప్రకటించాడు. బీసీసీఐ పోస్ట్ చేసిన వీడియోలో దిలీప్.. ఈ సిరీస్లో రింకూ సింగ్తో పాటు కొంతమంది యువ ఆటగాళ్లు తమలోని అత్యుత్తమ ఫీల్డర్ను బయటకు తీసారని కొనియాడాడు. కోహ్లీని విజేతగా ప్రకటించగానే టీమ్ మెంబర్స్ చప్పట్లతో ప్రశంసలు కురిపించారు. అక్కడే కూర్చుని ఉన్న టీమిండియా సారథి రోహిత్ శర్మ.. దిలీప్, కోహ్లీ పేరు అనౌన్స్ చేయగానే ఆనందంతో అతడిని అభినందించాడు.
𝗗𝗿𝗲𝘀𝘀𝗶𝗻𝗴 𝗥𝗼𝗼𝗺 𝗕𝗧𝗦 | 𝗙𝗶𝗲𝗹𝗱𝗲𝗿 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗦𝗲𝗿𝗶𝗲𝘀
After a fantastic 3⃣-0⃣ win over Afghanistan, it’s time to find out who won the much-awaited Fielder of the Series Medal 🏅😎
Check it out 🎥🔽 #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/N30kVdndzB
— BCCI (@BCCI) January 18, 2024
స్వదేశంలో కొద్దిరోజుల క్రితమే ముగిసిన వన్డే వరల్డ్ కప్ సందర్భంగా టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్.. ‘బెస్ట్ ఫీల్డర్ అవార్డు’ విధానాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కాన్సెప్ట్ బాగా సక్సెస్ అయింది. ఆటగాళ్ల మధ్య సంబంధాలను ఇది మరింత బలోపేతం చేసింది. వరల్డ్ కప్లో రవీంద్ర జడేజా, కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ వంటి స్టార్ ప్లేయర్లు ఈ అవార్డును అందుకున్నారు.
This fielding effort of kohli won us a match last night. 🐐https://t.co/aSoAl5MxTL pic.twitter.com/N3OfJr33T4
— Rohit Sharma Selfless Academy (@SelflessRohit) January 18, 2024
ఇక మూడో టీ20 మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగుల భారీ స్కోరు చేసింది. రోహిత్ శర్మ సెంచరీ (121) చేయగా రింకూ సింగ్ (69) రాణించారు. అనంతరం అఫ్గాన్ కూడా 20 ఓవర్లలో 212 పరుగులు చేయడంతో స్కోర్లు సమమయ్యాయి. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. సూపర్ ఓవర్లో మొదట అఫ్గాన్ 16 పరుగులు చేయగా భారత్ కూడా అన్నే పరుగులు చేసింది. తద్వారా రెండో సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ సారి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 11 రన్స్ చేయగా అఫ్గాన్ ఒక్క పరుగు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోవడంతో భారత్ ఘనవిజయం సాధించింది.