Virat Kohli | దేశప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం మరి కొద్ది రోజుల్లో రానుంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ప్రాణప్రతిష్ట (Pran Pratistha) కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిర్వాహకులు ఆహ్వానాలు అందించే ప్రక్రయను కూడా వేగవంతం చేశారు.
ఇప్పటికే రాజకీయ, వ్యాపార, సినీ, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందిన విషయం తెలిసిందే. తాజాగా టీంఇండియా పరుగుల రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli) దంపతులకు కూడా ఆహ్వానం అందింది. నిర్వాహకులు స్వయంగా కోహ్లీ, అనుష్క (Anushka Sharma)ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
హిందువుల చిరకాల స్వప్నమైన రామమందిర నిర్మాణం సాకారమైంది. ఈ సందర్భంగా రాముడి ప్రాణ ప్రతిష్ట వేడకకు రామాలయ ట్రస్ట్ 7 వేల మందికి ఆహ్వానాలు పంపింది. వీళ్లలో రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు క్రికెట్ దిగ్గజాలు కూడా ఉన్నారు. వీళ్లలో మాజీ సివిల్ సర్వీసెంట్లు, ఆర్మీ అధికారులు, న్యాయవాదులు, ఇంద్రజాలికులతో పాటు పద్మశ్రీ, పద్మ భూషన్ అవార్డు విజేతలు ఉన్నారు. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగనుంది.
Also Read..
MS Dhoni | ధోనీపై పరువు నష్టం దావా.. ఢిల్లీ హైకోర్టులో రేపు విచారణ
Salt | ఉప్పు ప్రాణానికి ముప్పు.. పరిమితికి మించి వాడకంతో ఏటా 18.9 లక్షల మంది మృతి