IPL 2025 : భారీ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(44 నాటౌట్) వీరకొట్టుడు కొడుతున్నాడు. బౌలర్ మారినా బంతి గమనం స్టాండ్కే అన్నట్టు చెలరేగుతున్నాడు. మొదటి ఓవర్ నుంచే బౌండరీలతో విరుచుకుపడ్డ యశస్వీ.. తొలి వికెట్కు వైభవ్ సూర్యవంశీ(40)తో కలిసి 76 పరుగులు జోడించాడు. హర్ప్రీత్ ఓవర్లో వైభవ్ ఔటైనా..ఈ డాషింగ్ ఓపెనర్ దూకుడు తగ్గించలేదు. యాన్సెన్ వేసిన 6వ ఓవర్లో అతడు రెండు ఫోర్లు బాదగా.. కెప్టెన్ సంజూ శాంసన్(4 నాటౌట్) బౌండరీ కొట్టాడు. దాంతో, రాజస్థాన్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది.
ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన రాజస్థాన్ భారీ లక్ష ఛేదనను దూకుడుగా ఆరంభించింది. అర్ష్దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో యశస్వీ జైస్వాల్(44 నాటౌట్).. ఫోర్లు, ఒక సిక్సర్తో 22 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత మార్కో యాన్సెన్ ఓవర్లో వైభవ్ సూర్యవంశీ(40) తన ప్రతాపం చూపించి 6, 4, 6 బాదగా 17 రన్స్ వచ్చాయి. ఈ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్ల విధ్వంసంతో రాజస్థాన్ స్కోర్ 2 ఓవర్లకే 38కి చేరింది. అనంతరం గ్జావియర్ బార్ట్లెట్ బౌలింగ్లో యశస్వీ మూడు బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దాంతో.. 3 ఓవర్లకు స్కోర్ 50 దాటింది.
Raised the temperature with 𝙨𝙘𝙤𝙧𝙘𝙝𝙞𝙣𝙜 𝙨𝙝𝙤𝙩𝙨 🌡
14-year old Vaibhav Suryavanshi departs after a breathtaking 40(15) 😎#RR notch up their highest powerplay score ever- 89/1
Updates ▶ https://t.co/HTpvGewE3N #TATAIPL | #RRvPBKS | @rajasthanroyals pic.twitter.com/Zu6muZJokz
— IndianPremierLeague (@IPL) May 18, 2025
ఈ సీజన్లో అత్యంత వేగంగా యాభై కొట్టిన జట్టుగా రాజస్థాన్ రికార్డు నెలకొల్పింది. ఇక అర్ష్దీప్ను అరుసుకున్న వైభవ్ తొలి బంతికి ఫోర్.. ఆఖరి రెండు బంతుల్ని స్టాండ్స్లోకి పంపి పంజాబ్ గుండెల్లో గుబులు పుట్టించాడు. ఈ జోడీని విడదీసేందుకు హర్ప్రీత్ బ్రార్ను రంగంలోకి దింపిన అయ్యర్ ఫలితం సాధించాడు. అతడి బౌలింగ్లో కొట్టిన వైభవ్.. మరో పెద్ద షాట్ ఆడబోయి యాన్సెన్ చేతికి చిక్కాడు. దాంతో, 76 వద్ద రాజస్థాన్ తొలి వికెట్ పడింది.