హైదరాబార్, సెప్టెంబర్ 20(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో క్రీడా, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.52 కోట్లు మంజూరు చేయాలని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశంలో క్రీడలను ప్రోత్సహించడం, మిగతా దేశాలకు దీటుగా పోటీనిచ్చేందుకు లక్ష్యాలను ఎంచుకోవడంపై సోమవారం కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ఠాకూర్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రం నుంచి మంత్రి శ్రీనివాస్గౌడ్ ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో అనేక క్రీడాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
దేశంలో అత్యుత్తమ క్రీడాపాలసీని తీసుకురాబోతున్నాం. ఖేలో ఇండియా కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాం. మెదక్, కరీంనగర్, వరంగల్లో సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు. రాష్ట్రంలో మరో మూడు క్రీడా పాఠశాలలు నెలకొల్పండి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడా, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఖేలో ఇండియా డిప్యూటీ డైరెక్టర్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.