Mumbai Marathon : ముంబైలో జరిగిన టాటా మారథాన్(Marathon) 2024 పరుగు విషాదంగా మారింది. ఆదివారం సందడిగా మొదలైన ఈ పరుగులో ఇద్దరు కన్నుమూశారు. మృతులను కోల్కతాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సువ్రదీప్ బెనర్జీ(Suvradeep Benerjee), ముంబైకి చెందిన 74 ఏండ్ల రన్నర్ రాజేంద్ర బోరా(Rajendra Bora)లుగా గుర్తించారు. అంతేకాదు డీహైడ్రేషన్ కారణంగా మరో 22 మంది ఆస్పత్రి పాలయ్యారు.
రెగ్యులర్గా టాటా మారథాన్లో పాల్గొనే సువ్రదీప్.. హజి అలీ జంక్షన్ దగ్గర ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. ఆ కాసేపటికే మరైన్ డ్రైవ్లోని పిజ్జా పాయింట్ వద్ద కిందపడిపోయిన రాజేంద్ర మరణించాడు. డీహైడ్రేషన్ కారణంగానే ఈ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారని నిర్వాహకులు తెలిపారు. అయితే.. మారథాన్ పరుగులో పాల్గొనే రన్నర్లకు సరైన ఏర్పాట్లు చేయలేదని పలువురు నిర్వాహకులపై మండిపడుతున్నారు.
We are grieved by the demise of our participants, Suvradeep Banerjee and Rajendra Bora.
Asian Heart Institute, the event’s Medical Partner, ensured all necessary medical protocols were followed, and they were attended immediately.
Read the full statementhttps://t.co/iwRfPZoG4S pic.twitter.com/mDiWoDe9jq
— Tata Mumbai Marathon (@TataMumMarathon) January 21, 2024
ఈ మారథాన్లో ఇథియోపియా రన్నర్లు విజేతలుగా నిలిచారు. పురుషుల విభాగంలో హేలీ లెమీ బెర్హను టైటిల్ నిలబెట్టుకోగా.. మహిళల విభాగంలో అబెరాష్ మిన్సెవో టైటిల్ సాధించింది.