ISPL: క్రికెట్ను అమితంగా ప్రేమించే భారత్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL), ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) వంటివి అభిమానులను అలరిస్తున్నాయి. వచ్చే ఏడాది గల్లీ క్రికెటర్ల కోసం ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) షూరూ కానుంది. ఈ కొత్త లీగ్పై పలువురు సినీ సెలబ్రిటీలు ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ హీరో అమితాబ్(Amitab) ముంబై జట్టును, హృతిక్ రోషన్ బెంగళూరు, అక్షయ్ కుమార్ శ్రీనగర్ జట్లను కొన్నారు. తాజాగా వీళ్ల సరసన తెలుగు సినీ నటుడు రామ్ చరణ్(Ram Charan) చేరాడు. ఈ స్టార్ హీరో హైదరాబాద్ టీమ్ను కొన్నాడు.
‘గల్లీ క్రికెట్ లీగ్ హైదరాబాద్ జట్టుకు యజమాని అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐఎస్పీఎల్లో హైదరాబాద్ జట్టు జైత్రయాత్ర కోసం, అందమైన జ్ఞాపకాల్ని పోగు చేసుకునేందుకు నాతో చేతులు కలపండి’ అని మెగా పవర్ స్టార్ ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా రాసుకొచ్చాడు. భారత్లో గల్లీ క్రికెట్ ఆడే టెన్నిస్ బాల్తో ఆడించనుండటం విశేషం. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ లీగ్ మొదలుకానుంది.
Excited to announce my ownership of Team Hyderabad in the Indian Street Premier League!
Beyond cricket, this venture is about nurturing talent, fostering community spirit, and celebrating street cricket’s essence.
Join me as we elevate Hyderabad’s presence in the ISPL,… pic.twitter.com/DQA29n18qp
— Ram Charan (@AlwaysRamCharan) December 24, 2023
ఐపీఎల్లో మాదిరిగానే ఈ లీగ్లో కూడా ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను బరిలోకి దింపుతాయి. ఆరు ఫ్రాంచైజీలతో తొలి సీజన్ జరగనుంది. ముంబై (మహారాష్ట్ర), హైదరాబాద్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్), చెన్నై (తమిళనాడు), కోల్కతా (వెస్ట్ బెంగాల్), బెంగళూరు (కర్నాటక), శ్రీనగర్ (జమ్మూ కాశ్మీర్) ఫ్రాంచైజీలు ఈ లీగ్లో తలపడనున్నాయి. టీ-10 ఫార్మాట్లో నిర్వహించనున్నఈ లీగ్లో ఆరు జట్లు పాల్గొంటాయి. ఆరు జట్లు ఏడు రోజుల పాటు 19 మ్యాచ్లు ఆడనున్నాయి.
Welcome the Mega Power Star @AlwaysRamCharan as the esteemed owner of Team Hyderabad in ISPLT10 🤩
Registrations are open 👉🏼 https://t.co/S4QoVw2oZQ 🏏#RamCharan #newt10era #street2stadium #ISPL #cinematiccricket pic.twitter.com/UyHw0A58VE
— ISPL (@ispl_t10) December 24, 2023
వచ్చేఏడాది ఫిబ్రవరి 24న ముంబై వేదికగా ఐఎస్పీఎల్ వేలం జరుగనుంది. ఒక్కో జట్టుకు ఒక కోటి రూపాయల పర్స్ వాల్యూ ఉండగా.. ఒక ప్లేయర్కు కొనుగోలుకు అత్యధిక నగదు రూ. 3 లక్షలు. ఈ లీగ్కు టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి కమిషనర్గా వ్యవహరించనుండగా బీసీసీఐ కోశాధికారి ఆశిష్ షెలార్, ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమోల్ కాలేలు కమిటీ మెంబర్లుగా ఉన్నారు.