IND vs RSA : భారత మిడిలార్డర్ బ్యాటర్ సంజూ శాంసన్(108 : 113 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) వన్డే సెంచరీ కల నిజం చేసుకున్నాడు. 50 ఓవర్ల ఆటలో మూడంకెల స్కోర్ కోసం 8 ఏండ్లుగా నిరీక్షిస్తున్న శాంసన్ దక్షిణాఫ్రికా గడ్డపై సెంచరీ కొట్టాడు. కేశవ్ మహరాజ్ వేసిన 44వ ఓవర్ ఆఖరి బంతికి సంజూ సింగిల్ తీసి వందకు చేరువయ్యాడు. అనంతరం సంతోషం పట్టలేక డగట్లోని భారత బృందానికి తన కండలు చూపించాడు. తిలక్ వర్మ(52) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్(16) బౌండరీతో తన ఉద్దేశాన్ని చాటాడు. 45 ఓవర్లకు స్కోర్.. 245/4.
Much awaited, job done 💯https://t.co/mDg07w2hl1 | #SAvIND pic.twitter.com/XRCsag8bFM
— ESPNcricinfo (@ESPNcricinfo) December 21, 2023
అంతకుమందు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(52) సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొని వన్డేల్లో తొలి హాఫ్ సెంచరీ బాదాడు. ఆ కాసేపటికే కేశవ్ మహరాజ్ ఓవర్లో భారీ షాట్ ఆడి మల్డర్ చేతికి చిక్కడంతో తిలక్ ఖతర్నాక్ ఇన్నింగ్స్కు తెరపడింది. దాంతో, 217 రన్స్ వద్ద భారత్ నాలుగో వికెట్ పడింది. శాంసన్తో కలిసి తిలక్ నాలుగో వికెట్కు రికార్డు స్థాయిలో 116 పరుగులు జోడించాడు. మొదట్లో నిదానంగా ఈ ఇద్దరూ కుదరుకున్నాక ధాటిగా ఆడి జట్టు స్కోర్ 200 దాటించారు.