IND vs WI : వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టీ20లోనూ భారత యువ బ్యాటర్లు తడబడ్డారు. దాంతో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. మిడిలార్డర్లో తిలక్ వర్మ (51 : 41 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ధాటిగా ఆడిన తిలక్.. ఇషాన్ కిషన్(27), హార్దిక్ పాండ్యా(24)తో కలిసి స్కోర్ను పరుగెత్తించాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్(14)తో కలిసి కెప్టెన్ పాండ్యా ఇన్నింగ్స్ నిర్మించాడు. చివర్లో రవి బిష్ణోయ్(8 నాటౌట్), అర్ష్దీప్ సింగ్(6 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో భారత్ 150 పరుగులు చేయగలిగింది.
Maiden T20I FIFTY for @TilakV9 👏👏
What a fine knock this has been by the youngster.
Live – https://t.co/mhKN4Dq5T0… #WIvIND pic.twitter.com/JpYUP2M7ho
— BCCI (@BCCI) August 6, 2023
గయానాలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ తీసుకున్నాడు. కానీ, టీమిండియాకు శుభారంభం దక్కలేదు. శుభ్మన్ గిల్(7), సూర్యకుమార్ యాదవ్(1) తక్కువకే వెనుదిరిగారు. తొలి మ్యాచ్లో విఫలమైన సంజూ శాంసన్(7) మరోసారి నిరాశ పరిచాడు. అకీల్ హొసేన్ ఓవర్లో ఫ్రంట్ఫుట్ వచ్చి స్టంపౌట్ అయ్యాడు. కాసేపటికే తిలక్ వర్మ కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత భారీ షాట్ ఆడి బౌండరీ వద్ద మెక్కాయ్ చేతికి చిక్కాడు. దాంతో 114 పరుగుల వద్ద ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను పాండ్యా, అక్షర్ పటేల్ ఆదుకున్నారు.
ఇవి కూడా చదవండి