Wrestling | ఇస్తాంబుల్: పారిస్ ఒలింపిక్స్లో బెర్తులు దక్కించుకోవడానికి భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ వేదికగా నేటి నుంచి జరుగబోయే వరల్డ్ రెజ్లింగ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్లో మల్ల యోధులు తాడో పేడో తేల్చుకోనున్నారు. వేర్వేరు విభాగాలలో 14 మంది పోటీపడతారు. ఫ్రీ స్టయిల్ విభాగంలో అమన్ సెహ్రావత్, సుజీత్, జైదీప్, దీపక్ పునియా, సుమిత్, దీపక్ బరిలో ఉండగా గ్రీకో రోమన్ కేటగిరీలో సుమిత్, అషు, వికాస్, సునీల్ కుమార్, నితేశ్, నవీన్ పోటీ పడనున్నారు. మహిళల ఫ్రీ స్టయిల్లో మాన్సీ, నిషా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.