ముంబై: టీ20 వరల్డ్కప్( T20 World Cup ) కోసం ఎంపిక చేసిన ఇండియన్ టీమ్లో శిఖర్ ధావన్కు చోటు దక్కకపోవడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మధ్యే శ్రీలంక టూర్లో టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించిన ప్లేయర్కే 15 మంది టీమ్లో స్థానం దక్కకపోవడమేంటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తరఫున కూడా ధావన్ మంచి ఫామ్లో ఉన్నాడు. అయినా సెలక్టర్లు అతన్ని కరుణించలేదు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి.
ఓపెనర్లు ఎక్కువైపోయారు..
శిఖర్ ధావన్ను టీమ్లోకి తీసుకుంటే కచ్చితంగా ఓపెనింగే పంపాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే టీమ్లో ఓపెనింగ్ ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. టీమ్ తరఫున రాహుల్, రోహిత్ ఓపెనింగ్ చేయడం ఖాయం. ఒకవేళ వీళ్లలో ఎవరో ఒకరు గాయపడితే తప్ప ఈ కాంబినేషన్ను మార్చే చాన్స్ లేదు. ఆ పరిస్థితే వస్తే.. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.. లేదంటే కెప్టెన్ విరాట్ కోహ్లిలలో ఒకరిని ఓపెనింగ్ పంపే అవకాశం ఉంది.
సూర్యకుమార్ తప్ప ఐపీఎల్లో ఆయా ఫ్రాంచైజీలకు ఓపెనర్లుగా ఇషాన్, కోహ్లి ఆడి రాణించారు. ప్రధానంగా ధావన్ను సెలక్టర్లు లైట్ తీసుకోవడానికి కారణం ఇదే. ఇక ఓపెనర్గా టీ20ల్లో మొదట నిదానంగా ఆడటం కూడా ధావన్కు ప్రతికూలంగా మారింది. వన్డే స్టైల్లోనే టీ20ల్లోనూ ఆడటానికి ధావన్ ప్రయత్నిస్తాడు. అతని స్టైల్ టీ20లకు పనికి రాదు.