Rohit Sharma | ‘బజ్బాల్’ ఆటతో ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఇంగ్లండ్కు భారత్ తొలి షాకిచ్చింది. భారత్లో ఇంగ్లండ్ పప్పులుడకలేదు. అయితే తమ ఓటములను అంతగా పట్టించుకోని ఇంగ్లీష్ క్రికెటర్లు.. టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ వాళ్ల అంతర్జాతీయ స్థాయి బౌలర్లను దంచికొడుతుంటే మాత్రం ఆ క్రెడిట్ తమదే అని గొప్పలు చెప్పుకుంటున్నారు. రాజ్కోట్ టెస్టులో జైస్వాల్ డబుల్ సెంచరీ చేసిన తర్వాత ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ స్పందిస్తూ.. జైస్వాల్ తమ ఆటను చూసి స్ఫూర్తి పొందాడని, ఆ క్రెడిట్ తమకే దక్కుతుందని కామెంట్ చేశాడు. అయితే తాజాగా డకెట్ కామెంట్స్కు టీమిండియా సారథి రోహిత్ శర్మ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
ధర్మశాల టెస్టుకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో విలేకరుల నుంచి రోహిత్కు ఇదే ప్రశ్న ఎదురైంది. దానికి రోహిత్ స్పందిస్తూ… ‘మా జట్టులో రిషభ్ పంత్ అని ఓ కుర్రాడు ఉండేవాడు. బహుశా అతడు ఆడేప్పుడు బెన్ డకెట్ చూసి ఉండడేమో..’అంటూ కౌంటర్ ఇచ్చాడు. 2021-22 లో ఇంగ్లండ్ టూర్కు వెళ్లిన భారత జట్టులో వికెట్ కీపర్గా ఉన్న రిషభ్ పంత్.. వారి గడ్డపైనే ఇంగ్లీష్ బౌలర్లను ఆటాడుకున్నాడు. తనదైన అగ్రెసివ్ ఆటతో రాణించాడు.
Rohit Sharma said “There was a guy called Rishabh Pant in our team, probably Ben Duckett hasn’t seen him play”. [Sahil Malhotra from News18 about Duckett comments in Press]
Captain on fire. 🔥😄 pic.twitter.com/CVjVTiOqmq
— Johns. (@CricCrazyJohns) March 6, 2024
ఈ సిరీస్లో జైస్వాల్.. నాలుగు టెస్టులలో ఏకంగా 94.57 సగటుతో 655 పరుగులు చేశాడు. బజ్బాల్కు కౌంటర్గా ‘జైస్బాల్’ ఆట ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్లను ఆటాడుకుంటున్నాడు. సుమారు 700 వికెట్లు తీసిన జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో జైస్వాల్ ఈజీగా సిక్సర్లు కొట్టాడు.