హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ హుస్సేన్సాగర్ వేదికగా జూలై 16 నుంచి 23 వరకు యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (వైసీహెచ్) ఆధ్వర్యంలో మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్ జరుగనుంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) లింగ సమానత్వంలో భాగంగా ప్రాజెక్ట్ నావిక కింద వైసీహెచ్ టోర్నీలో అమ్మాయిలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తున్నది. తొలిసారి ప్రవేశపెడుతున్న మిక్స్ డ్ ఇంటర్నేషనల్ 420 ఈవెంట్లో తెలంగాణ నుంచి ఐదుగురు సెయిలర్లు బరిలోకి దిగుతున్నారు.
ఇప్పటికే హైదరాబాద్ నుంచి ప్రీతి కొంగర..ఒలింపిక్ టెస్టు ఈవెంట్కు సిద్ధమవుతుండగా, ధరణి, రవళి, తనూజ కామేశ్వర్, వైష్ణవి వీరవంశం రెగెట్టా టోర్నీలో పోటీ పడబోతున్నారు. వీరికి తోడు దీక్షిత, లాహిరి, డానియల్, బన్నీ సత్తాచాటేందుకు తహతహలాడుతున్నారు. సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయెల్ నుంచి జ్యూరీ సభ్యులు టోర్నీలో పాల్గొంటున్నట్లు సుహేమ్ షేక్ పేర్కొన్నారు.