బాసెల్ : భారత మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ త్రిసా జాలీ-గాయత్రి గోపీచంద్ స్విస్ ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. మంగళవారం జరిగిన పోరులో భారత జోడీ14-21, 14-21 స్కోరుతో ఇండోనేషియాకు చెందిన అప్రియాని రహాయు-సిటి ఫదియ సిల్వా చేతిలో ఓడిపోయారు.
కాగా మాళవికా బన్సోద్ 21-17, 21-7తో లారెన్ లామ్పై గెలుపొంది ప్రధాన డ్రాకు అర్హత సాధించింది. మహిళల డబుల్స్లో సిక్కి రెడ్డి-సారా సునీల్ 21-15, 15-21, 21-18తో పౌలా లిన్-లారెన్ లామ్పై, మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్, సిక్కిరెడ్డి 21-17, 15-21, 21-18తో పాట్రిక్ షీల్-ఫ్రాంజిస్కా వోక్మన్పై గెలిచి ప్రధాన డ్రాలో చోటు దక్కించుకున్నారు.