గాలె: శ్రీలంక-ఏతో గురువారం నుంచి మొదలైన అనధికారిక తొలి టెస్టులో భారత ‘ఏ’ జట్టు తొలిరోజే భారీ స్కోరు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్కు వచ్చిన యువ భారత్.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 333 పరుగులు చేసింది.
ఓపెనర్గా వచ్చిన సాయి సుదర్శన్ (132) సూపర్ శతకానికి తోడు కెప్టెన్ ధృవ్ జురెల్ (68 బ్యాటింగ్), షేక్ రషీద్ (53 బ్యాటింగ్) రాణించడంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది.