CWC 2023: భారత్ వేదికగా జరుగుతున్న 13వ వన్డే వరల్డ్ కప్ ఎడిషన్ లీగ్ దశ ముగింపునకు చేరింది. ఇదివరకే సెమీస్ బెర్తులు ఖాయమైన ఈ మెగా టోర్నీలో శనివారం రెండు మ్యాచ్లు ముగిస్తే సెమీస్ పోరు మొదలుకానుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్ – న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ ముంబైలోని వాంఖెడే వేదికగా ఈనెల 15న జరగాల్సి ఉంది. నవంబర్ 16న సౌతాఫ్రికా – ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీస్ జరగాల్సి ఉంది. అయితే తొలి సెమీస్కు ముందే దేశ ప్రజలు దీపావళి పండుగ జరుపుకోనున్న నేపథ్యంలో శుక్రవారం ముంబై లోని అరేబియా సముద్ర ఒడ్డు తీరాన ఉన్న ‘గేట్ వే ఆఫ్ ఇండియా’పై వరల్డ్ కప్ దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి.
భారతదేశ ముఖద్వారంగా పిలుచుకునే గేట్ వే ఆప్ ఇండియాపై వరల్డ్ కప్ థీమ్స్తో పాటు సెమీస్కు చేరిన జట్లు, భారత సారథి రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆసీస్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్వెల్, సఫారీ విధ్వంసక వీరులు హెన్రిచ్ క్లాసెన్, పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్తో పాటు పలు ఇతర ఫోటోలకు సంబంధించిన లైటింగ్ షో వీక్షకులను ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Diwali 🤝 Cricket World Cup
A celebration of two big festivals at the Gateway of India 🤩#CWC23 pic.twitter.com/hgMBd0JwTV
— ICC (@ICC) November 10, 2023
వరల్డ్ కప్ సంతోషంతో పాటు గౌరవాన్ని తెచ్చిందని సూచించేలా ఐసీసీ పలు ఫోటోలను ప్రదర్శనకు పెట్టింది. నెదర్లాండ్స్ ఆటగాళ్లు ‘నమస్తే’ అంటూ ఫోజ్ ఇవ్వడం, విరాట్ కోహ్లీ-నవీన్ ఉల్ హక్లు వైరాన్ని మరిచి పలకరించుకోవడాన్ని చూపిస్తూ ఫోటోలను ప్రదర్శించింది. భారీ షాట్లు ఆడి తమ జట్లను గెలిపించిన క్లాసెన్, ఫకర్లు వరల్డ్ కప్లో తమ పవర్ చూపించారని అర్థం వచ్చేలా స్లైడ్ వేసింది.
WOW!
The Gateway of India lights up in Mumbai to celebrate #CWC23 and Diwali 🪔
Head to our WhatsApp channel to watch the full video: https://t.co/bYzj1L8sTU pic.twitter.com/HDCgBa0G3n
— ICC (@ICC) November 10, 2023