బులవాయొ: ఐసీసీ అండర్-19 ప్రపంచకప్లో ఇంగ్లండ్ జట్టు ఫైనల్కు చేరింది. బుధవారం ఇక్కడి క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఉత్కంఠగా జరిగిన తొలి సెమీస్ పోరులో ఆ జట్టు.. ఆస్ట్రేలియాను 27 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి మొదలు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కెప్టెన్ థామస్ ర్యూ (110) సెంచరీతో 50 ఓవర్లలో 277/7 చేసిం ది. ఛేదనలో ఆసీస్ కూడా పోరాడింది.
ఆ జట్టు సారథి ఒలీవర్ పీక్ (100) కూడా శతకంతో ఆదుకున్నా కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. ఇంగ్లిష్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విజయానికి 27 రన్స్ దూరంలోనే ఆలౌట్ అయింది. గురువా రం భారత్, ఆఫ్ఘానిస్థాన్ మధ్య జరుగబోయే రెండో సెమీస్లో గెలిచిన జట్టుతో ఈనెల 6న ఇంగ్లండ్ ఫైనల్ ఆడుతుంది.