Team India : ఆస్ట్రేలియాతో నామమాత్రమైన మూడో వన్డే కోసం భారత జట్టు(Team India) రాజ్కోట్ చేరుకుంది. అక్కడి విమానాశ్రయంలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(R Ashwin), శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్(Ishan Kishan), బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్(Vikram Rathore) కెమెరా కంటపడ్డారు. సెప్టెంబర్ 27 భారత్, ఆసీస్ మధ్య మూడో వన్డే జరుగనుంది.
ఇండోర్లో నిన్న జరిగిన రెండో వన్డేలో టీమిండియా కంగారూలను చిత్తు చేసింది. 99 పరుగుల తేడాతో గెలిచి 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది. ఇక మూడో వన్డేలో శుభ్మన్ గిల్, శార్దూల్ ఠాకూర్కు విశ్రాంతినిచ్చారు. తొలి రెండు వన్డేలకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) జట్టుతో కలువనున్నారు.
Mohali ✅
Indore ✅#TeamIndia arrive ✈️ for the third and the final ODI in Rajkot 👌#INDvAUS pic.twitter.com/pIrDvPFNyB— BCCI (@BCCI) September 25, 2023
ఇండోర్ మ్యాచ్ ఆడని పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jaspreet Bumrah) కూడా మూడో వన్డేకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రెండు మ్యాచుల్లో నెగ్గిన భారత్ మూడో విజయంతో స్టీవ్ స్మిత్ సేను వైట్వాష్ చేయాలనే పట్టుదలతో ఉంది. అదే జరిగితే వరల్డ్ కప్ ముందు టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు కానుంది.