ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ పోటీలకు భారత్ రావాల్సిన పాకిస్థాన్ జట్టు(Pakistan Team)కు వీసా(Visa) ఓకే అయింది. ఇస్లామాబాద్లోని (Islamabad)లోని భారత దౌత్య కార్యాలయంలో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో పాక్ బృందానికి వీసా మంజూరు చేశారు. దాంతో, రెండు రోజుల్లో బాబర్ ఆజాం(Babar Azam) నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు, సహాయక సిబ్బంది ఇండియాకు రానున్నారు.
భారత వీసా కోసం పాక్ జట్టు నిరీక్షించాల్సి వచ్చింది. వీసా ఆలస్యం కావడంతో ముందే ప్లాన్ చేసుకున్న దుబాయ్ టీమ్ బాండింగ్ ట్రిప్ను పాక్ క్రికెట్ బోర్డు(PCB) రద్దు చేసుకుంది. అంతేకాదు ఈ విషయంపై ఐసీసీ(ICC)కి ఫిర్యాదు కూడా చేసింది. అయితే.. ఈరోజు వీసా ఓకే కావడంతో పాక్ ఆటగాళ్లు, సిబ్బంది ఇండియా విమానం ఎక్కేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రపంచ కప్ ముందు బాబర్ సేన హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం(Hyderabad uppal stadium)లో రెండు వామప్ మ్యాచ్లు ఆడనుంది.
పాకిస్థాన్ vs న్యూజిలాండ్
సెప్టెంబర్ 29న న్యూజిలాండ్తో, 30వ తేదీన ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్ అక్టోబర్ 14న అహ్మదాబాద్లో ఎదురుపడనున్నాయి. అయితే.. ప్రపంచ కప్ చరిత్రలో దాయాదిపై టీమిండియాదే పైచేయిగా వస్తోంది. ఈసారి ఎవరు గెలుస్తారు? అనేది ఇరుదేశాల అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.
ఆసియా కప్లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్
ఈమధ్యే ముగిసిన ఆసియా కప్(Asia Cup 2023) సూపర్ 4 మ్యాచ్లో టీమిండియా చేతిలో బాబర్ సేన చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. పాక్ బౌర్లను ఉతికారేసిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. భారీ లక్ష్య ఛేదనలో పాక్ 228 పరుగుల తేడాతో చిత్తు అయింది. ఆ జట్టు పేస్ త్రయంలో ఒకడైన నసీం షా(Naseem Shah) గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. అతడి స్థానంలో హసన్ అలీ(Hasan Ali)ని ఎంపిక చేశారు.