ODI World Cup 2023 : క్రికెట్లో ఆటగాళ్ల ప్రతిభతో పాటు అప్పుడప్పుడు సెంటిమెంట్లకూ చాలా ప్రాధాన్యం దక్కుతుంది. మరో పది రోజుల్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2023) ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఓ సెంటిమెంట్ భారత అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. అదేంటంటే.. రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలోని భారత జట్టు నంబర్ 1(World No 1)గా ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగుతోంది.
గత రెండు పర్యాయాలు ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న జట్లే ట్రోఫీని ముద్దాడాయి. దాంతో ఈసారి కూడా అదే సెంటిమెంట్ కొనసాగుతుందని అభిమానులు భావిస్తున్నారు. మైకేల్ క్లార్క్(Michael Clark) సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు వన్డేల్లో నంబర్ 1 ర్యాంక్తో 2015లో వరల్డ్ కప్లో అడుగుపెట్టింది.
ప్రపంచ కప్ 2015 ట్రోఫీతో ఆస్ట్రేలియా జట్టు
అంచనాలకు తగ్గట్టే రాణించి ఫైనల్ చేరింది. తుదిపోరులో న్యూజిలాండ్ను మట్టికరిపించి ఐదోసారి విశ్వ విజేతగా నిలిచింది. ఇక 2019లో ఇంగ్లండ్(England) వేదికగా జరిగిన వరల్డ్ కప్లో ఆతిథ్య జట్టు నంబర్వన్ ర్యాంక్తోనే టైటిల్ వేట ప్రారంభించింది.
ప్రపంచ కప్ 2019 ట్రోఫీతో ఇయాన్ మోర్గాన్ సేన
బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ విజృంభించంతో ఫైనల్లో న్యూజిలాండ్(Newzealand)పై అద్భుత విజయం సాధించింది. అలా ఇయాన్ మోర్గాన్ సేన(Eoin Morgan) తొలిసారి వన్డే చాంపియన్గా అవతరించింది. దీంతో ముచ్చటగా మూడోసారి కూడా నంబర్ 1 జట్టే ట్రోఫీ గెలుస్తుందనే వార్తలు ఊపందుకున్నాయి.
ఇదొక్కటే కాదు మరో సారుప్యత కూడా కనిపిస్తోంది. 2011 వరల్డ్ కప్ నుంచి ఆతిథ్య జట్టే కప్పు నెగ్గుతూ వస్తోంది. 2011లో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ సంయుక్తంగా నిర్వహించిన వరల్డ్కప్లో ధోనీ సేన ట్రోఫీ కైవసం చేసుకుంది. 2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆతిథ్యమివ్వగా ఆసీస్ విజేతగా నిలిచింది. 2019లోనూ ఆతిథ్యమిచ్చిన ఇంగ్లండ్ జట్టే ప్రపంచ కప్ ట్రోఫీని కొల్లగొట్టింది. ఈ సెంటిమెంట్ ప్రకారంగా చూసినా భారత్ ఆతిథ్య హోదాలో చాంపియన్గా నిలుస్తుదని మజీ క్రికెటర్లు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.