Team India : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC Final 2023) ఫైనల్లో పరాజయం పాలైన భారత జట్టు.. మరో సర్కిల్ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. రెండు సార్లు (2021, 2023) డబ్ల్యూటీసీ తుదిపోరుకు అర్హత సాధించిన టీమిండియా రెండు పర్యాయాలు ఓటమి పాలైంది. దాంతో, 2023-25 లోనైనా టెస్టు చాంపియన్షిప్ గద(Mace) దక్కించుకోవాలని రోహిత్ శర్మ(Rohit Sharma) బృందం భావిస్తోంది. తొలి అడుగును వెస్టిండీస్ పర్యటన నుంచి ప్రారంభించనుంది.
ఈ నెల 12 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా.. ఇప్పటికే కరీబియన్ గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ బృందం ప్రాక్టీస్ ప్రారంభించింది. రెండు రోజుల ట్రైనింగ్ కమ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆఫ్స్టంప్ ఆవల పడ్డ బంతులపై ప్రాక్టీస్ చేస్తుంటే.. సిరాజ్ తన బౌలింగ్కు పదును పెంచే పనిలో నిమగ్నమయ్యాడు.
India’s warm up match.
Video Courtesy: Instagram/cricbarbados#IndianCricketTeam pic.twitter.com/ZawSnvYsqt
— Aniket (@anikkkett) July 5, 2023
సీనియర్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా(Chateshwar Pujara)కు చోటు దక్కకపోవడంతో అతడి స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. పానీపూరీ పోరగాడు యశస్వి జైస్వాల్(Yashasvi Jaiwal)ను ఆడిస్తారా? లేదా అతడిని ఓపెనర్గా పంపి.. శుభ్మన్ గిల్(Shubman Gill)ను వన్డౌన్లో ఆడిస్తారా? అనేది చూడాలి.
ఛతేశ్వర్ పుజారా, శుభ్మన్ గిల్
గిల్కు గతంలో మిడిలార్డర్లో ఆడిన అనుభవం ఉంది. భారత అండర్-19, భారత్ -‘ఎ’ జట్ల తరఫున గిల్ మిడిలార్డర్లో సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఆడాడు. ఆ సమయంలో కోచ్గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్(Rahul Dravid).. ప్రస్తుతం టీమ్ఇండియా హెడ్ కోచ్గా పనిచేస్తున్నాడు. దాంతో మూడో స్థానంలో ఎవరిని ఆడిస్తారు? అనే అంశంపై ప్రధానంగా చర్చ నడుస్తోంది.