TeamIndia : కిందటి ఏడాదిలో భారత క్రికెట్ మరపురాని, చిరస్మరణీయ క్షణాలను బీసీసీఐ ట్విట్టర్లో షేర్ చేసింది. ఇందులో క్రికెటర్ల వ్యక్తిగత ఘనతలు, అందుకున్నమైలురాళ్లు, కలకాలం గుర్తుండే అద్భుత ఇన్నింగ్స్లు, విదేశీ గడ్డపై సాధించిన రికార్డు విజయాలు ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్లో పాక్ మీద విరాట్ కోహ్లీ విశ్వరూపం, ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీలకు చోటు దక్కింది. మహిళా క్రికెట్లోని గొప్ప క్షణాలు కూడా బీసీసీఐ ఈ వీడియోలో చేర్చింది. ఇంతకు ఇందులో ఏమేం ఉన్నాయంటే..
2022 ఫిబ్రవరిలో అండర్-19 వరల్డ్ కప్లో యశ్ధూల్ కెప్టెన్సీలోని యువ భారత్ విజేతగా నిలిచింది. జూన్లో మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికింది. ఆస్ట్రేలియాతో ఎడ్జ్బాస్టన్లో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒకే ఓవర్లో అత్యధికంగా 35 పరుగులు సాధించాడు. ఆగష్టులో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత మహిళా క్రికెట్ జట్టు వెండి పతకం గెలిచింది. సెప్టెంబర్లో మహిళల జట్టు మూడు వన్డేల సిరీస్లో ఇంగ్లండ్ను 3-0తో వైట్వాష్ చేసింది. రెండు దశాబ్దాలుగా జాతీయ జట్టుకు ఆడిన ఝలన్ గోస్వామి సెప్టెంబర్లో క్రికెట్కు గుడ్ బై చెప్పింది.
దాదాపు మూడేళ్లుగా ఒక్క సెంచరీ చేయని విరాట్ కోహ్లీ సెప్టెంబర్ నెలలో మళ్లీ ఫామ్ అందిపుచ్చుకున్నాడు. ఆసియా కప్లో శ్రీలంక మీద అతను టీ20ల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. అక్టోబర్లో జరిగిన టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్ మీద కోహ్లీ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. హ్యారిస్ రౌఫ్ వేసిన 18వ ఓవర్లో చివరి రెండు బంతులును సిక్సర్లుగా మలిచి భారత్ విజయం ఖరారు చేశాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ 82 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించాడు.
ఇకనుంచి మహిళా క్రికెటర్లకు కూడా మగ క్రికెటర్లతో సమానంగా వేతనం చెల్లిస్తామని బీసీసీఐ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. టీ20 వరల్డ్ కప్, న్యూజిలాండ్ సిరీస్లో సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో నంబర్ 1 ర్యాంక్ సొంతం చేసుకున్నాడు.
డిసెంబర్లో యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ వన్డేల్లో వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించాడు. బంగ్లాతో జరిగిన మూడో వన్డేలో అతను 126 బంతుల్లోనే ద్విశతకం బాదాడు.131 బంతుల్లో 210 రన్స్ చేసి అవుట్ అయ్యాడు.
As we inch closer to welcoming the New Year 🎊, let’s take a look back at some of the 🔝 moments for #TeamIndia in 2️⃣0️⃣2️⃣2️⃣ 🙌🏻 pic.twitter.com/8d6OFCX0u6
— BCCI (@BCCI) December 31, 2022