IND vs ENG 5th Test ఇంగ్లండ్తో ధర్మశాలలో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు(Team India) కొండంత స్కోర్ దిశగా పయనిస్తోంది. ఈ మ్యాచ్లో టీమిండియా టాపార్డర్(Top Order) అరుదైన ఫీట్ సాధించింది. ఏకంగా ఐదుగురికి ఐదుగురు హాఫ్ సెంచరీపైనే స్కోర్ చేశారు. భారత క్రికెట్ చరిత్రలో టాపార్డర్ ఈ రేంజ్లో ఆడడం ఇది నాలుగోసారి.
తొలి రోజు ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(57), రోహిత్ శర్మ(103)లు అర్ధ శతకాలు పూర్తి చేసుకోగా.. రెండో రోజు శుభ్మన్ గిల్(110), అరంగేట్రం కుర్రాడు దేవ్దత్ పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56)లు యాభై బాదేశారు.
It’s only the fourth time that India’s top five batters have all scored 50+ in the same Test innings, the first time against England 👏 #INDvENG pic.twitter.com/DWkV7i0nqc
— ESPNcricinfo (@ESPNcricinfo) March 8, 2024
భారత టాపార్డర్ తొలిసారి 1998లో ఈ ఫీట్ సాధించింది. ఆస్ట్రేలియాపై బ్యాటింగ్ ఆర్డర్లోని ఐదుగురు అర్ధ శతకాలతో చెలరేగారు. ఆ తర్వాత 1999లో మొహాలీ(Mohali) వేదికగా న్యూజిలాండ్పై టాప్-5 ఫిఫ్టీలు బాదారు. ఇక చివరిసారిగా 2009లో ముంబైలో శ్రీలంకపై భారత టాపార్డర్ హాఫ్ సెంచరీతో తడాఖా చూపించింది.
Maiden Test ✅
Maiden Test fifty ✅
Welcome to Test cricket, Devdutt Padikkal 👏 👏
Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/pkDgbvtVIF
— BCCI (@BCCI) March 8, 2024
ఓవర్నైట్ స్కోర్ 135-1తో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్కు రోహిత్.. శుభ్మన్ గిల్ భారీ స్కోర్ అందించారు. వీళ్లు సెంచరీలు బాదడంతో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని దాటేసి.. టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఆ తర్వాత వచ్చిన పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56)లు ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆటాడుకుంటూ హాఫ్ సెంచరీ సాధించారు. దాంతో, టీమిండియా స్కోర్ 400 దాటింది. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్లో భారత్ ఆధిక్యం 210 పరుగులు దాటింది.