భారత జట్టు షెడ్యూల్లో మరో సిరీస్ను బీసీసీఐ చేర్చింది. వరుసగా సిరీసులు ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లు.. శ్రీలంకతో టెస్టుల తర్వాత టీ20 క్రికెట్ పండుగ ఐపీఎల్ ఆడనున్నారు. ఆ తర్వాత సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడతారు. అనంతరం ఇంగ్లండ్ బయలుదేరతారు. గతేడాది ఐదు మ్యాచుల టెస్టు సిరీస్లో అర్ధంతరంగా రద్దు చేసిన ఐదో టెస్టును జులై 1 -5 మధ్యలో ముగిస్తారు.
అయితే దీనికన్నా ముందు జూన్ 26 -28 మధ్య ఐర్లాండ్లో రెండు టీ20 మ్యాచులు ఆడనున్నారు. ఈ విషయాన్ని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈ వేసవి ‘సీసన్ ఆఫ్ స్టార్స్’గా మారనుందంటూ ఐర్లాండ్ బోర్డు ట్వీట్ చేసింది. టీమిండియాతోపాటు వన్డేల్లో నెంబర్ వన్గా ఉన్న న్యూజిల్యాండ్ కూడా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అలాగే ఐర్లాండ్, సౌతాఫ్రికా మధ్య కూడా సిరీస్ షెడ్యూల్ అయింది.
అయితే ఐర్లాండ్తో ఆడే భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు పాల్గొనకపోవచ్చని సమాచారం. వీళ్లందరూ ఆ సమయంలో ఇంగ్లండ్తో జరిగే టెస్టు మ్యాచ్ కోసం సిద్ధమవుతారని తెలుస్తోంది.
📡: MEN’S INTERNATIONALS
This summer will be a ‘Season of Stars’ as India, New Zealand and Afghanistan tour Ireland, while we will play South Africa in Bristol.
We’re set for the biggest home international season in Ireland ever!
➡️ https://t.co/hHMk6Dgscj#BackingGreen ☘️🏏 pic.twitter.com/feD7eUkZ1J
— Cricket Ireland (@cricketireland) March 1, 2022