Team India : వన్డే ప్రపంచకప్(ODI World Cup 2023) ముందు టీమ్ఇండియా ఆస్ట్రేలియా(Australia)పై దుమ్మురేపింది. ఇప్పటికే రెండు మ్యాచ్ల్లోనూ నెగ్గిన సిరీస్ కైవసం చేసుకుంది. కాగా బుధవారం నామమాత్రమైన మూడో వన్డే జరగనుంది. ప్రధాన ఆటగాళ్లు తిరిగి జట్టులోకి రావడంతో పలువురికి రెస్ట్ లభించనుంది. ఇండోర్ వన్డేలోసెంచరీతో కదం తొక్కిన యువ ఓపెనర్ శుభ్మన్ గిల్(Shubhman Gill)కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వెల్లడించాడు.
‘కొందరు ప్లేయర్లు వ్యక్తిగత కారణాల వల్ల, మరికొందరు ఆరోగ్యం బాగాలేక చివరి మ్యాచ్ నుంచి విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం 13 మంది ఆటగాళ్లే అందుబాటులో ఉన్నారు. వరుస మ్యాచ్లు ఆడుతున్న గిల్కు రెస్ట్ ఇచ్చాం. షమీ(Shami), హార్దిక్, శార్దూల్ ఠాకూర్(Shardhul Thakur)ఇళ్లకు వెళ్లారు.
షమీ, కుల్దీప్ యాదవ్
స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్(Axar Patel) అందుబాటులో ఉండటం లేదు’ అని ఈ రోజు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో రోహిత్ వెల్లడించాడు. గత రెండు మ్యాచ్లలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ ఆడలేదు. రేపు రాజ్కోట్లో మధ్యాహ్నం 1ః30 భారత్, ఆస్ట్రేలియా మూడో వన్డేలో తలపడనున్నాయి.