ముంబై: ప్రముఖ జర్మన్ కంపెనీ అడిడాస్ (Adidas) ఇకపై టీమ్ఇండియా (Team India) కిట్ స్పాన్సర్గా (Kit Sponsor) వ్యవహరించనుంది. క్రీడా సంబంధిత వస్తువులు ఉత్పత్తి చేసే అడిడాస్తో జతకట్టనున్నామని బీసీసీఐ కార్యదర్శి జై షా (BCCI Secretary Jay Shah) ప్రకటించారు. ఈ ఒప్పందం జూన్ 1 నుంచి అమలులోకి రానుందని తెలిపారు. ఎంపీఎల్ స్పోర్ట్స్ (MPL Sports) 2020 నుంచి 2023 డిసెంబర్ వరకు భారత జట్టుకు కిట్ స్పాన్సర్గా వ్యవహరించాల్సి ఉన్నది. అయితే ఆ సంస్థ గత డిసెంబర్లో అర్థాంతరంగా తప్పుకోవడంతో కెవాల్ కిరణ్ (కిల్లర్ జీన్స్) తాత్కాలిక కిట్ స్పాన్సర్గా ఉన్నది. ఈ గడువు మే 31తో ముగియనుంది. అంతకుముందు 2016 నుంచి 2020 వరకు నైక్ (NIKE) సంస్థ టీమ్ఇండియా కిట్ స్పాన్సర్గా వ్యహరించిన విషయం తెలిసిందే. తాజాగా అడిడాస్తో ఒప్పందం ఓకే కావడంతో మరో అంతర్జాతీయ సంస్థ టీమిండియా జెర్సీల్లో దర్శనమివ్వనుంది.
కిట్ స్పాన్సర్గా అడిడాస్తో బీసీసీ ఒప్పందం కుదుర్చుకుందని ప్రకటిస్తున్నదుకుగాను సంతోషంగా ఉందని బోర్డు కార్యదర్శి జై షా వెల్లడించారు. క్రికెట్ క్రీడ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ప్రపంచంలోని ప్రముఖ క్రీడా దుస్తుల బ్రాండ్లలో ఒకటైన అడిడాస్తో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నాం. వెల్కమ్ అడిడాస్ అని జై షా ట్వీట్ చేశారు.
I'm pleased to announce @BCCI's partnership with @adidas as a kit sponsor. We are committed to growing the game of cricket and could not be more excited to partner with one of the world’s leading sportswear brands. Welcome aboard, @adidas
— Jay Shah (@JayShah) May 22, 2023
కాగా, 2023 నుంచి 2028 వరకు అంటే ఐదేండ్లపాటు టీమిండియా కిట్ స్పాన్సర్గా అడిడాస్ వ్యవహరించనున్నట్లు తెలుస్తున్నది. ఇందుకుగాను ఒక్కో మ్యాచ్కు రూ.65 లక్షలు చెల్లించనుంది. దీనిప్రకారం ప్రతీ ఏడాది సుమారు రూ.70 కోట్లు (ఐదేండ్లకు రూ.350 కోట్లు) చెల్లించేందుకు ఒప్పందం కుదిరిందని సమాచారం.