ఈ నెలాఖరులో జరగబోయే వెస్టిండీస్-భారత్ వన్డే సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కెప్టెన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాలకు వెస్టిండీస్ సిరీస్లో విశ్రాంతినిచ్చారు. యువ ఆటగాడు శుభ్మన్ గిల్కు మరోసారి వన్డే జట్టు నుంచి పిలుపొచ్చింది.
అతను చివరగా 2020 డిసెంబరులో భారత్ తరఫున అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడాడు. అలాగే, వెస్టిండీస్ పర్యటనలో వెటర్ ఓపెనర్ శిఖర్ ధావన్.. భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను వైస్ కెప్టెన్గా నియమించినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ పర్యటన కోసం మొత్తం 16 మందితో జట్టును ప్రకటించింది.
భారత జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, ఆవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్
#TeamIndia ODI squad:
Shikhar Dhawan (C), Ravindra Jadeja (VC), Ruturaj Gaikwad, Shubman Gill, Deepak Hooda, Suryakumar Yadav, Shreyas Iyer, Ishan Kishan (WK), Sanju Samson (WK), Shardul Thakur, Yuzvendra Chahal, Axar Patel, Avesh Khan, Prasidh Krishna, Mohd Siraj, Arshdeep Singh— BCCI (@BCCI) July 6, 2022