గాయం కారణంగా గత మ్యాచ్కు దూరమైన విరాట్ కోహ్లీ.. కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టును ముందుండి నడిపించినా.. సహచరుల నుంచి సరైన సహకారం లభించకపోవడంతో ఆఖరి టెస్టులో టీమ్ఇండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా పేసర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి భారత్ను దెబ్బకొట్టగా.. బుమ్రా చక్కటి బంతితో ప్రత్యర్థి సారథిని బుట్టలో వేసుకొని లెక్క సరిచేసే ప్రయత్నం ప్రారంభించాడు!
కేప్టౌన్: నిర్ణయాత్మక మూడో టెస్టులో టీమ్ఇండియా తడబడింది. దక్షిణాఫ్రికా బౌలర్లకు ఎదురు నిలుస్తూ.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (201 బంతుల్లో 79; 12 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్సెంచరీతో ఆకట్టుకున్నా.. టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 223 పరుగులకే ఆలౌటైంది. సీనియర్ ప్లేయర్ చతేశ్వర్ పుజారా (43) ఫర్వాలేదనిపించగా.. మిగిలినవాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కోహ్లీ యాంకర్ రోల్ పోషించగా.. రాహుల్ (12), మయాంక్ (15), రహానే (9), పంత్ (27), అశ్విన్ (2) విఫలమయ్యారు. సఫారీ బౌలర్లలో రబడ 4, జాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా మంగళవారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. సఫారీ నాయకుడు డీన్ ఎల్గర్ (3)ను బుమ్రా పెవిలియన్ పంపగా.. మార్క్మ్ (8)తో పాటు కేశవ్(6) క్రీజులో ఉన్నాడు. చేతిలో 9 వికెట్లు ఉన్న దక్షిణాఫ్రికా.. భారత స్కోరుకు 206 పరుగులు వెనుకబడి ఉంది.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 223 ఆలౌట్ (కోహ్లీ 79, పుజారా 43; రబడ 4/73, జాన్సెన్ 3/55),
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 8 ఓవర్లలో 17/1 (మార్క్మ్ 8 నాటౌట్; బుమ్రా 1/0).