అహ్మదాబాద్ : ప్రొ కబడ్డీ లీగ్లో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 42-31 స్కోరుతో ఢిల్లీ దబాంగ్ను మట్టికరపించింది. తలైవాస్ జట్టులో అజింక్య పవార్ అత్యధికంగా 21 పాయింట్లు సాధించి జట్టు విజయానికి దోహదం చేశాడు. నరేందర్ 8, అభిషేక్, హిమాంశు, సాహిల్ రెండేసి పాయింట్లు సాధించారు.
కాగా ఢిల్లీ జట్టులో నవీన్ కుమార్ 14, అశు మాలిక్ 9, హిమ్మత్, విశాల్ రెండేసి పాయింట్లు సాధించారు. ఉత్కంఠగా ముగిసిన మరో పోరులో గుజరాత్ జెయింట్స్ 34-31తో బెంగళూరు బుల్స్ను ఓడించింది. గుజరాత్ జట్టులో సోను 12, రాకేష్ సొంబీర్ చెరి 5, అర్కమ్మ, రోహిత్ చెరి 3, నబిబక్ష్ 2 పాయింట్లు సాధించగా, బెంగళూరు జట్టులో భరత్ 7, వికాస్ 6 పాయింట్లు సాధించారు.