క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి రంగం సిద్ధమైంది.ఈ నెల 17 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్లోని ఒత్తిడిని తట్టుకునేందుకు ప్రధాన జట్లన్నీ వార్మప్ మ్యాచ్లు ఆడనున్నాయి. ఈ వార్మప్ మ్యాచ్ల షెడ్యూల్ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం విరాట్ కోహ్లీ సారధ్యంలోని టీమిండియా రెండు వార్మప్ మ్యాచ్లు ఆడనుంది.
ఈ రెండు మ్యాచులు కూడా దుబాయ్ వేదికగానే జరగనున్నాయి. తొలుత 18వ తేదీన ఇంగ్లండ్తో, ఆ తర్వాత 20వ తేదీన ఆస్ట్రేలియాతో భారత జట్టు వార్మప్ మ్యాచ్లు ఆడుతుంది. ఈ మ్యాచులకు ప్రేక్షకులను అనుమతించబోమని ఐసీసీ ప్రకటించింది. మొత్తం 16 వార్మప్ మ్యాచ్లు జరుగుతాయని, వాటిలో 8 మ్యాచ్లు స్టార్ ఛానెల్లో బ్రాడ్కాస్ట్ అవుతాయని ఐసీసీ తెలిపింది.
ఐసీసీ డిజిటల్ వేదికల్లో ఈ మ్యాచ్ల హైలైట్స్ కూడా అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. టోర్నీలో టీమిండియా ఆడే తొలి మ్యాచ్ ప్రత్యర్థి దాయాది పాకిస్థాన్ కావడం క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. ఈ జట్ల మధ్య అక్టోబరు 24న మ్యాచ్ జరిగే మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే.