T20 World Cup | టీ20 వరల్డ్ కప్ జూన్ 2న ప్రారంభం కానున్నది. భారత్ జట్టు తొలి మ్యాచ్ను ఐర్లాండ్ ఆడననున్నది. మ్యాచ్కు టీమిండియా న్యూయార్క్లో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అమెరికాతో కలిసి వెస్టిండిస్ మెగా ఈవెంట్కు ఆతిథ్యం ఇస్తుండగా.. ఫైనల్ మ్యాచ్ జూన్ 29న జరుగనున్నది. ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు న్యూయార్క్కు చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం న్యూయార్క్ చేరుకున్నాడు. భారత ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ ప్రాకిస్ట్కు సంబంధించిన ఫొటోలను ఇన్స్టాలో అభిమానులతో షేర్ చేసుకున్నారు.
బుమ్రా ఇన్స్టాలో పెట్టిన పోస్టులో ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, టీ20 నెంబర్ వన్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. హార్దిక్ పెట్టిన పోస్ట్లో శుభ్మాన్ గిల్, దూబే, కోచ్ అక్షర్పటేల్తో పాటు కోచ్ ద్రవిడ్ ఉన్నారు. ఇదిలా ఉండగా.. గాయం కారణంగా 2022 నుంచి టీ20లకు దూరమైన బుమ్రా తిరిగి జట్టులో చేరాడు. బూమ్రా 2016, 2021 టీ20 ప్రపంచ కప్లో ఆడాడు. మొత్తం పది మ్యాచుల్లో 22.54 సగటుతో 11 వికెట్లు కూల్చాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్తో పాటు గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్లో ఈ ఫాస్ట్ బౌలర్ అద్భుతంగా రాణించాడు.
ముంబయి ఇండియన్స్ 14 మ్యాచ్ల్లో కేవలం నాలుగు విజయాలతో చివరి స్థానంలో నిలిచినప్పటికీ.. ఆడిన 13 మ్యాచుల్లో 16.80 సగటుతో 20 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 21 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్గా నిలిచాడు. మరో వైపు హార్దిక్ పాండ్యా ఫామ్ టీమిండియాను ఆందోళనకు గురి చేస్తున్నది. ఐపీఎల్లో బ్యాటింగ్, బౌలింగ్లో అద్భుతం చేయలేకపోయాడు. హార్దిక్ 13 ఇన్నింగ్స్ల్లో 216 పరుగులు చేశాడు.
బౌలింగ్లో 11 వికెట్లు తీయగలిగాడు. ఇక జూన్ 5న న్యూయార్క్ స్టేడియంలో ఐర్లాండ్తో భారత్ టీ20 ప్రపంచకప్ మొదలుపెట్టనున్నది. 9న చిరకాల ప్రత్యర్థి పాక్తో తలపడనున్నది. 12న అమెరికా, 15నతో ఆడనున్నది. టీమిండియా చివరిసారిగా 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐసీసీ ట్రోఫీని గెలవలేకపోయింది. ఈ సారైనా కప్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.