టీ20 ప్రపంచకప్ కోసం మొత్తం 15 మంది ఆటగాళ్లతో భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. వీరితోపాటు స్టాండ్బై ప్లేయర్లుగా మరో నలుగురిని ఎంపిక చేసింది. అయితే ఈ 19 మందిలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పేరు లేదు. ఈ ఏడాది తను ఆడిన టీ20 మ్యాచులు అన్నింట్లో అద్భుతంగా రాణించిన సంజూను ప్రపంచకప్ ఆడిస్తారని అభిమానులు ఎంతగానో ఆశించారు.
ముఖ్యంగా రిషభ్ పంత్ ఈ పొట్టి ఫార్మాట్లో పరమచెత్తగా ఆడుతుండటంతో కచ్చితంగా సంజూను సెలెక్ట్ చేస్తారని భావించారు. అయితే ఈ అంచనాలను తలకిందులు చేసిన సెలెక్టర్లు పంత్ వైపే మొగ్గుచూపారు. అలాగే ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన పేసర్ మహమ్మద్ షమీని కూడా జట్టులోకి తీసుకుంటారని ఆశించారు. ఆసియా కప్లో డెత్ ఓవర్లలో భువనేశ్వర్ అనుకున్నంతగా రాణించలేదు.
సూపర్4 దశలో భారత్ ఓడిన రెండు మ్యాచుల్లోనూ 19వ ఓవర్ వేసిన భువీ.. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో షమీని జట్టులోకి తీసుకుంటారని క్రికెట్ అభిమానులు అనుకున్నారు. అయితే అతన్ని స్టాండ్బై ఆటగాళ్లలో మాత్రమే బీసీసీఐ ఎంపిక చేసింది. దీంతో నెటిజన్లు బీసీసీఐపై మండి పడుతున్నారు. సంజూ శాంసన్, షమీలను జట్టులోకి తీసుకోకవపోడంపై తెగ ట్వీట్లు చేస్తున్నారు. దీంతో వీళ్లిద్దరి పేర్లు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.
Have some shame ignore Samson and picking Undeserving players..this is why we never won trophies since 2013 pic.twitter.com/crRgoFg1t3
— Anurag ™ (@RightGaps) September 12, 2022
Is this the backing Sanju samson got?
Rohit betrayed him #SanjuSamson #justice pic.twitter.com/vmm5EfbvnQ— M. (@VK__GoatI8) September 12, 2022