Suryakumar yadav | ఆసియా కప్ (Asia Cup) ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను భారత్ (Team India) చిత్తుచేసిన విషయం తెలిసిందే. సమిష్టి ప్రదర్శనతో కదంతొక్కుతూ పాక్ను ఓడించిన టీమ్ఇండియా.. రికార్డు స్థాయిలో తొమ్మిదో సారి ఆసియాకప్ను సగర్వంగా ముద్దాడింది. పహల్గాం ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితిలో భారత్ తమ సత్తాఏంటో చేతల్లో చూపెట్టింది. ఈ విజయంతో ఆటగాళ్లు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఆసియా కప్ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సందర్భంగా టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar yadav) కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆసియా కప్ టోర్నమెంట్ ఆడినందుకు తనకు వచ్చే మ్యాచ్ ఫీజును (match fee) భారత సైన్యానికి, పహల్గామ్ ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. విజయం అనంతరం సూర్య కుమార్ యాదవ్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘ఈ టోర్రమెంట్ ద్వారా నాకు వచ్చే మ్యాచ్ ఫీజును సాయుధ దళాలకు, పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సాయం చేయడానికి దానం చేయాలని నిర్ణయించుకున్నాను. జై హింద్’ అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చారు.
I have decided to donate my match fees from this tournament to support our Armed Forces and the families of the victims who suffered from the Pahalgam terror attack. You always remain in my thoughts 🙏🏽
Jai Hind 🇮🇳
— Surya Kumar Yadav (@surya_14kumar) September 28, 2025
ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు సూర్య కుమార్ యాదవ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘ఇది కద నిజమైన దేశభక్తి అంటే..’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. భారత టీ20 ఆటగాళ్లు ఒక్కో మ్యాచ్కు రూ.4 లక్షల వరకూ అందుకుంటారు. ఈ లెక్కన 2025 ఆసియా కప్లో ఏడు మ్యాచ్లకు గానూ సూర్య కుమార్ యాదవ్కు రూ.28 లక్షలు అందుకోనున్నారు. ఈ మొత్తాన్ని ఇండియన్ ఆర్మీ, పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అందించనున్నారు.
Also Read..
BCCI | ఆసియా కప్ విజేత భారత్కు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లంటే..?
Asia Cup trophy | ట్రోఫీ తీసుకోకుండా.. ఖాళీ చేతులతోనే టీమ్ ఇండియా సెలబ్రేషన్స్.. VIDEO
PM Modi | యుద్ధ భూమిలోనూ.. మైదానంలో ఫలితం ఒక్కటే: ప్రధాని మోదీ