నమస్తే తెలంగాణ నెట్వర్క్ : టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవా రం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరాడంబరంగా జరుపుకొన్నారు. జిల్లాలోని అ న్ని మండలాలు, గ్రామాలు, టీఆర్ఎస్ కార్యాలయాల ఎదుట పార్టీ జెండాలను ఆవిష్కరించి జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.
వలిగొండ మండలంలోని వివిధ గ్రామాల్లో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర నాయకుడు పైళ్ల రాజవర్ధన్రెడ్డి , డేగల పాండరి, మామిండ్ల రత్నయ్య, శివశాంత్రెడ్డి పాల్గొన్నారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో జరిగిన టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో శ్రీనివాస్గౌడ్, దామోదర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, నిరంజన్గౌడ్ పాల్గొన్నారు.
మోటకొండూర్ మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకను పురస్కరించు కొని టీఆర్ఎస్ జెండాను నాయకులు, కార్యకర్తలు ఆవిష్కరించారు
నారాయణపురం మండలం కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సర్పంచ్ శ్రీహరి పార్టీ జెండాను ఆవిష్కరించారు. లక్ష్మయ్య, ప్రేమ్చందర్ రెడ్డి పాల్గొన్నారు.
మోత్కూరు మండలంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకను పురస్కరించుకుని పార్టీ జెండాను మండలాధ్యక్షుడు రమేశ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో యాకుబ్రెడ్డి, తీపిరెడ్డి మేఘారెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ప్రకాశ్రాయుడును రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ సన్మానించారు.
యాదగిరిగుట్ట మండలంలో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరిగా యి. ఆయా కార్యక్రమాల్లో రేపాక స్వామి, ఎండీ అజ్జు, రాజుగౌడ్ పాల్గొన్నారు.
రామన్నపేట మండలంలో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యాలయాల ఎదుట టీఆర్ఎస్ జెండాలను నాయకులు ఆవిష్కరించారు.
ఆలేరు పట్టణంలో ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాయకులు, ప్రజాప్రతినిధులు వారి వారి ఇండ్లపై పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో వస్పరి శంకరయ్య, వైస్ చైర్మన్ మాధవి, చంద్రకళ, నర్సింహులు, రాములు పాల్గొన్నారు.
పోచంపల్లి మండలంలో జరిగిన ఆవిర్భావ వేడుకలో సుధాకర్రెడ్డి , వెంకటేశం, విజయలక్ష్మీ శ్రీనివాస్, మల్లారెడ్డి, శేఖర్రెడ్డి, సార సరస్వతి బాలయ్య గౌడ్ పాల్గొన్నారు.
ఆలేరు మండలంలోని కొలనుపాకలో జరిగిన వేడుకలో మామిడాల అంజయ్య, బాలరాజు, జంగ పరశురాములు, మిట్టపల్లి పాండు, బాశెట్టి రాజు పాల్గొన్నారు.
భువనగిరి పట్టణంలో జరిగిన టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలో సుధాకర్రెడ్డి, అమరేందర్, నిర్మలావెంకటస్వామి, చింతల కిష్టయ్య, జనగాం పాండు, మల్లయ్య పాల్గొన్నారు.
బీబీనగర్ మండలంలో జరిగిన వేడుకలో శ్రీనివాస్, గోలి పింగళ్రెడ్డి పాల్గొన్నారు.
గుండాల మండలంలో జరిగిన ఆవిర్భావ వేడుకలో దశరథ, అమరావతీశోభన్బాబు సైదులు, అబ్బులు, వరలక్ష్మి, శ్రీశైలం, వేణుగోపాల్, పాండరి, ప్రకాశ్ పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) మండలంలో జరిగిన వేడుకలో ఉప్పలయ్య, వెంకటేశ్గౌడ్, కవిత, ఇంద్రారెడ్డి, భిక్షపతి, వెంకన్న, అరుణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
బొమ్మలరామారం మండలంలో జరిగిన టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలో గణేశ్, బీరప్ప, నవీన్ గౌడ్ , అరుణ, పాపిరెడ్డి ,భరత్ పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట పట్టణంలో ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ఆయా కార్యక్రమాల్లో సుధాహేమేందర్గౌడ్, రవీందర్గౌడ్, వెంకటయ్య పాల్గొన్నారు.
రాజాపేట మండలంలో జరిగిన టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో రాజిరెడ్డి, బాలమణీయాదగిరిగౌడ్, గోపాల్గౌడ్, భిక్షపతిగౌడ్, సిద్ధులు, నరేందర్ తదితరులున్నారు.
అడ్డగూడూరు గ్రామపంచాయతీ సిబ్బందికి మంగళవారం మండల కేంద్రంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ దుస్తులను పంపిణీ చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 20 ఏండ్లు నిండిన సందర్భంగా మండలకేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ధర్మారంలోని తన ఇంటిపై టీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. కార్యక్ర మంలో సర్పంచ్ త్రివేణి, దగిరి,డప్పు మల్లేశ్, దయాకర్ పాల్గొన్నారు. మండల కేంద్రం లోని టీఆర్ఎస్ కార్యాలయం ఎదుట నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు.
భువనగిరి మండలంలోని బస్వాపురంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ జెండాను భువనగిరి ఎంపీపీ నిర్మలా వెంకటస్వామి ఎగురవేశారు. అమరేందర్, చింతల కిష్టయ్య, జనగాం పాండు, మల్లయ్య పాల్గొన్నారు.