అహ్మదాబాద్: దాదాపుగా రెండు నెలల నుంచి ఐపీఎల్ టీ20 మూడ్లో ఉన్న భారత ఆటగాళ్లకు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటం సవాలుతో కూడుకున్నదే అని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య వచ్చే నెల 7 నుంచి ఓవల్ వేదికగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప (డబ్ల్యూటీసీ) ఫైనల్ జరుగనున్నది. దీని కోసం ఇప్పటికే జట్లు ఇంగ్లండ్ చేరుకొని ప్రాక్టీస్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గవాస్కర్ మాట్లాడుతూ.. ‘ప్లేయర్లంతా టీ20 ఆడి వస్తున్నారు. టెస్టు క్రికెట్ అనేది సుదీర్ఘమైన ఫార్మాట్. ఇది ప్లేయర్లకు పెద్ద పరీక్షగా నిలువనుంది’ అని అన్నాడు. ఐపీఎల్లో చెన్నై తరఫున విధ్వంసక ఆటతీరుతో చెలరేగిపోయిన అజింక్యా రహానే ఇంగ్లండ్ గడ్డపై కీలకమయ్యే అవకాశముందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.