Virat Kohli | స్వదేశంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ 2023 (Cricket World Cup 2023 )లో టీమ్ ఇండియా పరుగుల రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli) సూపర్ ఫామ్లో దూసుకుపోతున్నాడు. ప్రపంచకప్లో భాగంగా భారత జట్టు ఆడిన ఐదు మ్యాచుల్లో విజయకేతనం ఎగుర వేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఐదు మ్యాచుల్లో కోహ్లీ ఒక్కడే ఏకంగా 354 పరుగులు చేసి మరోసారి తన బ్యాటింగ్ పవర్ను ప్రపంచానికి తెలియజేశాడు. అయితే, మైదానంలో చిరుతలా కనిపించే కోహ్లీ పక్కా డైట్ మెయిన్టెయిన్ చేస్తాడన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ టోర్నీలో కూడా కోహ్లీ ఆహారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు.
తాజాగా స్వదేశంలో జరుగుతున్న ప్రపంకప్లో కోహ్లీ ఎలాంటి ఆహారానికి ప్రాధాన్యత ఇస్తున్నాడన్న విషయాన్ని టీమిండియా బస చేసిన హోటల్ లీలా ప్యాలెస్లోని ఎగ్జిక్యూటివ్ చెఫ్ అనుష్మాన్ బాలి తాజాగా వెల్లడించాడు. విరాట్ శాఖాహారి కాబట్టి ఉడకబెట్టిన పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నట్లు వివరించారు. ‘విరాట్ మాంసం తినరు. ఆవిరితో ఉడికించిన ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు. డిమ్ సమ్స్, సోయా, మాక్ మీట్, టోఫూ, లీన్ వంటి ప్రోటీన్ ఆధారిత ఆహారాన్ని తీసుకుంటున్నారు’ అని వివరించారు.
ప్రపంచకప్ సమయంలో చాలా మంది ఆటగాళ్లు అధిక ప్రోటీన్లు, తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నట్లు బాలి వెల్లడించారు. కొందరు ఎక్కువగా గ్రిల్డ్ చికెన్, చేపలను ఇష్టపడుతున్నట్లు చెప్పారు. ఇక మెనూలో భాగంగా టిఫిన్స్ కింద మిల్లెట్ దోసెలు, మిల్లెట్ ఇడ్లీలు, క్వినోవా ఇడ్లీలను అందిస్తున్నట్లు చెప్పారు. ఈ టిఫిన్స్ ఆరోగ్యకరమైన ప్రోటీన్ అని ఆటగాళ్లందరికీ తెలుసని.. అందుకే ఆటగాళ్లంతా వీటిని తింటున్నారని చెప్పారు. అయితే, రాగి దోసెలు భారత జట్టుకు ఇష్టమైన అల్పాహారమని ఆయన వివరించారు.
Also Read..
Israel-Hamas War | ఇజ్రాయెల్ దాడిలో ముగ్గురు హమాస్ కీలక కమాండర్లు హతం
Cricket World Cup | నేడు దక్షిణాఫ్రికాతో పాక్ బిగ్ఫైట్.. గెలిస్తేనే సెమీస్ రేసులో దాయాది జట్టు
Jyotripriya Mallick | రేషన్ స్కామ్లో బెంగాల్ మంత్రి అరెస్ట్