Satya Nadella | చరిత్రాత్మక వాంఖడే స్టేడియం (Wankhede Stadium) వేదికగా న్యూజిలాండ్తో బుధవారం జరిగిన సెమీఫైనల్ పోరులో టీమ్ఇండియా (India vs New Zealand) 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రజలు ఈ మ్యాచ్ను మొదటి నుంచి ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. జట్టు గెలవాలని పూజలు చేశారు. ఎట్టకేళకు ఇండియా గెలుపుతో రాత్రంతా సంబరాల్లో మునిగి తేలారు. అయితే, సామాన్య ప్రజలే కాదు.. పలువురు ప్రముఖులు కూడా రాత్రంతా టీవీలకు అతుక్కుపోయి మరీ మ్యాచ్ను ఎంజాయ్ చేశారు. అలా మైక్రోసాఫ్ట్ సీఈవో (Microsoft CEO) సత్య నాదెళ్ల (Satya Nadella) సైతం రాత్రంతా మేల్కొని మరీ ఈ మ్యాచ్ను ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
సియాటెల్లో మైక్రోసాఫ్ట్ డెవలపర్కాన్ఫరెన్స్లో కీలక ఉపన్యాసం చేసి వచ్చిన తర్వాత రాత్రంతా మేల్కొని మరీ భారత్ – న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ను వీక్షించినట్లు చెప్పారు. ‘ఇగ్నైట్ పేరిట సియాటెల్లో మైక్రోసాఫ్ట్ డెవలపర్ కాన్ఫరెన్స్ను షెడ్యూల్ చేసిన రోజే వన్డే ప్రపంచకప్ 2023 సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని మాకు తెలియదు. కాన్ఫరెన్స్లో కీలక ఉపన్యాసం చేసి వచ్చిన తర్వాత మ్యాచ్లో మునిగిపోయా. రాత్రంతా మేల్కొనే ఉన్నా. భారత్ విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు.
కాగా, చరిత్రాత్మక వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో బుధవారం జరిగిన సెమీఫైనల్ పోరులో టీమ్ఇండియా 70 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ (113 బంతుల్లో 117, 9 ఫోర్లు, 2 సిక్స్లు) అద్భుత సెంచరీకి తోడు శ్రేయస్ అయ్యర్ (70 బంతుల్లో 105, 4 ఫోర్లు, 8 సిక్స్లు) ధనాధన్ ఇన్నింగ్స్తో భారత్ 397/4 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ లక్ష్యఛేదనలో మహమ్మద్ షమీ (7/57) బౌలింగ్ విజృంభణతో కివీస్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. ఓవరాల్గా మెగాటోర్నీలో నాలుగోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించిన భారత్ ముచ్చటగా మూడోసారి కప్ను ముద్దాడేందుకు మరో అడుగుదూరంలో ఉంది.
Also Read..
Vande Mataram | మా తుఝే సలామ్తో హోరెత్తిన వాంఖడే.. వీడియో వైరల్
World Cup 2023 | నలభై ఏండ్లలో నాలుగో ఫైనల్.. ఈసారి కప్పు కొడితే చరిత్రే