Anushka Sharma | కోట్లాది భారతీయుల ఆశలను తమ భుజస్కంధాలపై మోసుకుంటూ భారత క్రికెట్ జట్టు ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్లో ఫైనల్లోకి ప్రవేశించింది. చరిత్రాత్మక వాంఖడే స్టేడియం (Wankhede Stadium) వేదికగా న్యూజిలాండ్తో బుధవారం జరిగిన సెమీఫైనల్ పోరులో టీమ్ఇండియా (India vs New Zealand) 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక సెమీఫైనల్ మ్యాచ్లో టీమ్ఇండియా పరుగుల రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli) చెలరేగి ఆడాడు. సెంచరీతో విజృంభించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ సందర్భంగా పలు రికార్డులను నమోదు చేశాడు. తాను ఎంతగానో ఆరాధించే సచిన్ టెండూల్కర్ ఎదుటే అతడి రికార్డును బ్రేక్ చేశాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీ (50)లు చేసిన తొలి ప్లేయర్గా వరల్డ్ రికార్డును సృష్టించాడు. విరాట్ చరిత్ర సృష్టించడంతో స్టేడియం ఒక్కసారిగా మారుమోగిపోయింది. అయితే ఈ మ్యాచ్లో విరాట్ భార్య, బాలీవుడ్ స్టార్ నటి అనుష్క శర్మ (Anushka Sharma) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
గ్యాలరీలో కూర్చొని మ్యాచ్ను వీక్షిస్తున్న అనుష్క.. ప్రతీ మూమెంట్ను ఎంతగానో ఎంజాయ్ చేసింది. కోహ్లీకి ఛీర్స్ చెబుతూ సందడి చేసింది. ఇక కోహ్లీ సెంచరీ చేసిన సమయంలో అనుష్క ముద్దుల వర్షం కురిపించింది. కోహ్లీ సైతం అనుష్క వైపు చూసి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మైదానంలోని కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఆ సమయంలో అనుష్క వేసుకున్న డ్రెస్ కూడా అందరినీ ఆకర్షించింది. మ్యాచ్లో అనుష్క ఓవైర్ సైజ్ ప్రింటెడ్ పూల చొక్కా, మ్యాచింగ్ షార్ట్ ధరించి ఎంతో అందంగా కనిపించింది. దీంతో నెటిజన్లు ఇప్పుడు అనుష్క డ్రెస్ ఖరీదు ఎంత అని ఆరాతీయడం మొదలు పెట్టారు. బ్రాండ్ వెబ్సైట్ ప్రకారం ఆ డ్రెస్ రూ. 19,500గా చూపిస్తోంది. ఇక మొత్తం సెట్ కొనుగోలు చేయాలనుకుంటే రూ.27,500 అవుతుంది. దీంతో డ్రెస్ ఖరీదు చూసి నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
చరిత్రాత్మక వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో బుధవారం జరిగిన సెమీఫైనల్ పోరులో టీమ్ఇండియా 70 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ (113 బంతుల్లో 117, 9 ఫోర్లు, 2 సిక్స్లు) అద్భుత సెంచరీకి తోడు శ్రేయస్ అయ్యర్ (70 బంతుల్లో 105, 4 ఫోర్లు, 8 సిక్స్లు) ధనాధన్ ఇన్నింగ్స్తో భారత్ 397/4 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ లక్ష్యఛేదనలో మహమ్మద్ షమీ (7/57) బౌలింగ్ విజృంభణతో కివీస్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. ఓవరాల్గా మెగాటోర్నీలో నాలుగోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించిన భారత్ ముచ్చటగా మూడోసారి కప్ను ముద్దాడేందుకు మరో అడుగుదూరంలో ఉంది.
Also Read..
Vande Mataram | మా తుఝే సలామ్తో హోరెత్తిన వాంఖడే.. వీడియో వైరల్
Nana Patekar | సెల్ఫీ కోసం వచ్చిన యువకుడిని కొట్టడంతో విమర్శలు.. క్షమాపణలు కోరిన నానా పటేకర్
Earthquake | జమ్మూ కశ్మీర్లో స్వల్ప భూకంపం.. భయాందోళనలో ప్రజలు