Vande Mataram | అద్భుతం ఆవిష్కృతమైంది..! కోట్లాది భారతీయుల ఆశలను తమ భుజస్కంధాలపై మోసుకుంటూ భారత క్రికెట్ జట్టు ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్లో ఫైనల్లోకి ప్రవేశించింది. చరిత్రాత్మక వాంఖడే స్టేడియం (Wankhede Stadium) వేదికగా న్యూజిలాండ్తో బుధవారం జరిగిన సెమీఫైనల్ పోరులో టీమ్ఇండియా (India vs New Zealand) 70 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించింది. జట్టు విజయంతో దేశంమొత్తం సంబరాలు చేసుకుంటోంది. ఈ సందర్భంగా కోహ్లీ అత్యద్భుత ప్రపంచ రికార్డులతోపాటు మరో ఉద్విగ్న క్షణం వాంఖడే స్టేడియంలో ఆవిష్కృతమైంది. మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలోని వేలాదిమంది ‘వందేమాతరం’ (Vande Mataram) గీతాన్ని ఆలపించారు.
ప్రముఖ గాయకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘మా తుఝే సలామ్’ పాట స్టేడియంలో వినిపించగానే మ్యాచ్ చూస్తున్న సుమారు 32 వేల మంది క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా పెదవి కలిపారు. తమ వద్ద ఉన్న ఫోన్ ఫ్లాష్ లైట్స్ ఆన్ చేసి, జాతీయ జెండాలను చేతపట్టి ముక్తకంఠంతో గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. ఈ ఉద్విగ్నభరిత క్షణాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
చరిత్రాత్మక వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో బుధవారం జరిగిన సెమీఫైనల్ పోరులో టీమ్ఇండియా 70 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ (113 బంతుల్లో 117, 9 ఫోర్లు, 2 సిక్స్లు) అద్భుత సెంచరీకి తోడు శ్రేయస్ అయ్యర్ (70 బంతుల్లో 105, 4 ఫోర్లు, 8 సిక్స్లు) ధనాధన్ ఇన్నింగ్స్తో భారత్ 397/4 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ లక్ష్యఛేదనలో మహమ్మద్ షమీ (7/57) బౌలింగ్ విజృంభణతో కివీస్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. ఓవరాల్గా మెగాటోర్నీలో నాలుగోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించిన భారత్ ముచ్చటగా మూడోసారి కప్ను ముద్దాడేందుకు మరో అడుగుదూరంలో ఉంది.
The whole Wankhede crowds singing “Maa Tujhe Salaam, Vande Mataram” today’s match.
– Absolute Goosebumps…!!! 🇮🇳pic.twitter.com/OtPtv5lGiM
— CricketMAN2 (@ImTanujSingh) November 15, 2023
Vande Matram At Wankhade!
Goosebumps 🇮🇳 🔥 pic.twitter.com/wwB60GaygF
— Sameet Thakkar (@thakkar_sameet) November 15, 2023
Also Read..
Yellareddy | జనంతో కిటకిటలాడిన ఎల్లారెడ్డి బీఆర్ఎస్ సభ.. స్టిల్స్..
రోదసిలోకి రోబో పాము.. అంతరిక్షంలో వెళ్లి ఇది ఏం చేయబోతుంది?