హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్లో శ్రీనిధి దక్కన్ ఫుట్బాల్ క్లబ్(ఎస్డీఎఫ్సీ) గెలుపు జోరు కొనసాగుతున్నది. శుక్రవారం దక్కన్ ఎరీనాలో జరిగిన మ్యాచ్లో శ్రీనిధి ఎఫ్సీ 4-1తో ఇంటర్ కాశిపై ఘన విజయం సాధించింది.
పూర్తి స్థాయి ఆధిపత్యం ప్రదర్శించిన మ్యాచ్లో శ్రీనిధి తరఫున గాబ్రియెల్, పవన్కుమార్, లాల్తులంగ, లాల్బైకలినా గోల్స్ చేయగా, మారియో బార్కో..ఇంటర్ కాశీకి ఏకైక గోల్ అందించాడు.