సిడ్నీ: టీ20 ప్రపంచకప్లో భాగంగా శనివారం సిడ్నీలో జరుగనున్న క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ను ఎంచుకుంది. ఇంగ్లాండ్ నాకౌట్ చేరాలంటే ఈ మ్యాచ్లో శ్రీలంకపై తప్పక గెలవాల్సిందే. చావో రేవో తేలాల్సిన మ్యాచ్లో టాస్ ఓడిన ఇంగ్లాండ్ ఐదు పాయింట్లతో మూడోస్థానంలో ఉండగా శ్రీలంకపై గెలిస్తే మెరుగైన రన్రేట్తో సెమీస్కు వెళుతుంది.
ఆసీస్ కంటే మెరుగైన రన్రేట్ ఉన్నందున ఇంగ్లాండ్ జట్టు ఒక్క పరుగుతోనైనా గెలిస్తే చాలు సెమీస్ బెర్తు ఖరారవుతుంది. శ్రీలంకపై 128 పరుగులతో గెలుస్తే కివీస్ను అధిగమించి నెంబర్వన్ స్థానానికి ఎగబాకుతుంది. కాగా శ్రీలంకతో జరిగిన గత ఏడు టీ-20 మ్యాచ్ల్లోనూ ఇంగ్లాండ్ విజయం సాధించింది.