Keshav Maharaj | దక్షిణాఫ్రికా క్రికెటర్ (South African cricketer) కేశవ్ మహరాజ్ (Keshav Maharaj) అయోధ్య రామ మందిరాన్ని (Ram Janmabhoomi Temple) సందర్శించాడు. గురువారం ఉదయం అయోధ్య చేరుకున్న అతడు బాల రాముడిని దర్శించుకున్నాడు. ఈ మేరకు మందిరంలో దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. శ్రీరాముడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికీ ఉండాలని పేర్కొన్నాడు.
అయితే 2024 ఐపీఎల్లో పాల్గొనేందుకు కేశవ్ ఇటీవలే భారత్కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో అతడు లక్నో సూపర్ జెయింట్స్కు (Lucknow Super Giants) ప్రాతినిధ్యం వహించనున్నాడు. కాగా, గతేడాది వన్డే వరల్డ్కప్ సమయంలో భారత్లో పర్యటించిన కేశవ్.. కేరళలోని పలు ఆలయాలను సందర్శించాడు.
Also Read..
Suicide Bombing | జీతాల కోసం బ్యాంకు వద్ద వేచిఉన్న వారే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి.. ముగ్గురు మృతి
Lok sabha elections | వికసిత్ భారత్ వాట్సప్ మెసేజ్లను వెంటనే ఆపేయండి.. కేంద్రానికి ఈసీ ఆదేశం
Janhvi Kapoor | మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కిన జాన్వీ కపూర్.. వీడియో షేర్ చేసిన ఓరీ