Janhvi Kapoor | అలనాటి అందాల తార శ్రీదేవి తనయ, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor)కు దైవభక్తి ఎక్కువే. ఖాళీ సమయం దొరుకుతే చాలు తిరుమలలో వాలిపోతుంటుంది. స్నేహితులు, బంధువులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్తుంటుంది. ఈ నేపథ్యంలోనే మార్చి 6వ తేదీన తన పుట్టినరోజును పురస్కరించుకొని పిన్ని మహేశ్వరి, స్నేహితులు శిఖర్ పహారియా (Shikhar Pahariya), ఓరీ (Orry)తో కలిసి జాన్వీ కపూర్ తిరుమల వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంది (Tirupati temple).
అయితే, అప్పుడు ఆమె కాలినడకన తిరుమల వెళ్లింది. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ మోకాళ్లపై మెట్లు ఎక్కినట్లు ఓరీ తాజాగా తెలిపాడు. ఈ మేరకు తమ తిరుమల ట్రిప్కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. శ్రీవారి దర్శనంలో భాగంగా వీరు తిరుపతి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్నారు. ఈ క్రమంలో మోకాళ్ల పర్వతం వద్ద జాన్వీ కపూర్, శిఖర్ మోకాళ్లపై మెట్లెక్కారు (climbs her knees). ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Also Read..
Water Crisis | ఐపీఎల్ మ్యాచ్లకూ తప్పని నీటి కష్టాలు.. చిన్నస్వామి స్టేడియానికి శుద్ధిచేసిన నీరు
Jaggi Vasudev | సద్గురు ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చిన ఆయన కూతురు
Bengaluru | బెడ్రూమ్ కిటికీ తెరిచి ఉంచుతున్నారంటూ.. పొరుగింటి జంటపై మహిళ ఫిర్యాదు