Water Crisis | కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) లో ఐపీఎల్ మ్యాచ్లకూ (IPL matches) నీటి కష్టాలు (Water Crisis) తప్పడం లేదు. గతేడాది సరిపడా వర్షం పడక ఇప్పుడు సిలికాన్ సిటీ తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. నగరంలో ప్రజల అవసరాలకే నీరు లభించని పరిస్థితి నెలకొంది. ఇళ్ల వద్ద బోర్లు ఎండిపోవడంతో ప్రజలు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. వారు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో త్వరలో ఆరంభం కానున్న ఐపీఎల్లో భాగంగా నిర్వహించే మ్యాచ్లకు నీటి సరఫరాపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒక్కో మ్యాచ్కు కనీసం 75 వేల లీటర్ల నీటి అవసరం ఉంటుంది.
ఈ మేరకు స్టేడియానికి నీటి సరఫరాపై కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మేనేజ్మెంట్ బోర్డ్ విన్నపం మేరకు ది బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (Bangalore Water Supply and Sewerage Board) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వేస్ట్వాటర్ను శుద్ధి చేసి (treated water) చిన్నస్వామి స్టేడియంకు (M Chinnaswamy stadium) సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ నీటిని కబ్బన్ పార్క్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (Cubbon Park wastewater treatment plant) నుంచి తీసుకోనున్నారు. దీనిపై బీడబ్ల్యూఎస్ఎస్బీ ఛైర్మన్ రామ్ ప్రసాద్ మనోహర్ మాట్లాడుతూ.. శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాము సరఫరా చేస్తున్నామని కావేరీ నది, భూగర్భ జలాలను వాడటంలేదన్నారు.
Also Read..
Jaggi Vasudev | సద్గురు ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చిన ఆయన కూతురు
Bengaluru | బెడ్రూమ్ కిటికీ తెరిచి ఉంచుతున్నారంటూ.. పొరుగింటి జంటపై మహిళ ఫిర్యాదు
Earthquake | మహారాష్ట్రలో వరుస భూకంపాలు.. నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు కంపించిన భూమి