IND vs SA : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న పొట్టి సిరీస్లో కీలకమైన సమరానికి మరికాసేపట్లో తెరలేవనుంది. వాండరర్స్లోని జొహన్నెస్బర్గ్లో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ తీసుకుంది.
మూడు టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్ వర్షార్ఫణం కాగా.. రెండో మ్యాచ్లో ఆతిథ్య జట్టు డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 5 వికెట్ల తేడాతో గెలిచింది. దాంతో, సిరీస్ సమం చేయాలంటే సూర్యకుమార్ సేన కచ్చితంగా ఈ రోజు గెలిచితీరాలి.
భారత్ : యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్ శర్మ, రవీంద్ర జడేజా, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, సిరాజ్, ముకేశ్ కుమార్.
దక్షిణాఫ్రికా : రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీట్జ్కే, ఎడెన్ మర్క్రమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిట్సన్ స్టబ్స్, అండిలే పెహ్లుక్వాయో, నంద్రె బర్గర్, లిజాద్ విలియ్స్, తబ్రేజ్ షంసీ, ఒట్నియెల్ బార్త్మన్.