జొహన్నెస్బర్గ్: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో వారం ఆలస్యంగా భారత్తో ప్రారంభమవుతున్న టెస్టు సిరీస్కు దక్షిణాఫ్రికా సేన సిద్ధమవుతున్నది. ఈనెల 26న సెంచూరియన్లో మొదలుకానున్న సిరీస్కు క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) 21 మందితో కూడిన జట్టును ప్రకటించింది. డీన్ ఎల్గర్ సారథ్యంలో బవుమా, రబాడ, నోర్జే, డసెన్, డికాక్ వంటి స్టార్ ఆటగాళ్లతో జట్టు టీమ్ఇండియాతో తలపడనుంది. ఈ బృందంలో ఇద్దరు కొత్త ముఖాలు పేసర్ సిసాంద మగల, బ్యాటర్ రికల్టన్కు చోటు దక్కింది. నెదర్లాండ్స్ వన్డే సిరీస్కు విశ్రాంతి తీసుకున్న రబాడ, నోర్జే కీలక పోరుకు సిద్ధమయ్యారు. న్యూజిలాండ్ టెస్టు సిరీస్లో ఘన విజయం సాధించి జోష్ మీదున్న టీమ్ఇండియాతో డీన్ ఎల్గర్ బృందం తలపడనుంది.
జట్టు: డీన్ ఎల్గర్ (కెప్టెన్), బవుమా, డికాక్, రబాడ, సరెల్, హెండ్రిక్స్, లిండే, కేశవ్ మహారాజ్, ఎంగ్డి, మార్క్రమ్, మల్దర్, నోర్జే, పీటర్సన్, డసెన్, వెరెయన్, జాన్సన్, స్టర్మన్, సుబ్రాయన్, మగల, రికల్టన్, ఒలివర్.