బ్లోమ్ఫోంటీన్ : ఇంగ్లండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ను సౌతాఫ్రికా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే గెలుచుకున్నది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత ఇంగ్లండ్ 7 వికెట్లకు 342 పరుగులు చేయగా, సమాధానంగా సౌతాఫ్రికా అయిదు బంతులు మిగిలి ఉండగా 5 వికెట్లకు 347 పరుగులు చేసి గెలుపొందింది.
సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా సెంచరీ(109)తో జట్టును గెలిపించి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. మిల్లర్ (58*) రాణించాడు.