Sony Sports : భారత దేశానికి చెందిన స్పోర్ట్స్ ఛానెల్ సోనీ స్పోర్ట్స్ ఈ ఏడాది భారీ ఒప్పందం కుదుర్చుకుంది. శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ ) గ్లోబల్ ప్రసార హక్కులు రైట్స్ దక్కించుకుంది. మనదేశానికే చెందిన డిస్నీ స్టార్తో పోటీ పడి మరీ హక్కులు సొంతం చేసుకుంది. నాలుగేళ్ల కాలానికి సోనీ స్పోర్ట్స్ శ్రీలంక జట్టు మ్యాచ్లను ఈ ఛానెల్ ప్రసారం చేయనుంది. అయితే.. ఎంత మొత్తానికి ఈ ఒప్పందం చేసుకుంది అనేది తెలియాల్సి ఉంది. దాదాపు రూ. 100 కోట్లకు (23 మిలియన్ డాలర్లు) బిడ్డింగ్ వేసిందని అంచనా. కాంట్రాక్టు ధర తగ్గడానికి కారణం టీమిండియా, శ్రీలంకతో ఆడే మ్యాచులు కొన్నే.
ఎస్ఎల్సీ ప్రపంచ హక్కులు సొంతం చేసుకోవడం కోసం నాలుగు భారతీయ కంపెనీలు పోటీ పడిన విషయం తెలిసిందే. ఫ్యాన్కోడ్, స్టార్స్పోర్ట్స్, డిస్నీ స్టార్, సోనీ స్పోర్ట్స్ బిడ్డింగ్కు ఆసక్తి చూపించాయి. అయితే.. మర్చి 1 నాటికి కేవలం రెండు కంపెనీలు మాత్రమే బరిలో నిలిచాయి. మొదట్లో రేసులో ఉన్నవైకోమ్ 18 సంస్థ వెంటనే తప్పుకుంది. ఎందుకంటే.. ఇప్పటికే ఆ మీడియా సంస్థ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మీడియా హక్కులు దక్కించుకుంది.
శ్రీలంక – భారత్ జట్లు ఎనిమిది మ్యాచ్లు ఆడనున్నాయి. 2024లో మూడు టీ20లు, మూడు వన్డేల్లో ఎదురుపడనున్నాయి. 2026లో ఇరుజట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. 2023 ఏప్రిల్ నుంచి 2027 మార్చి వరకు సోనీ స్పోర్ట్స్ ఒప్పందం కొనసాగనుంది. అయితే.. వచ్చే నాలుగేళ్లలో ఇరుజట్ల మధ్య మరిన్ని మ్యాచ్లు జరగొచ్చేనే నమ్మకంతో శ్రీలంక క్రికెట్ బోర్డు ఉంది. ఈ నాలుగేళ్ల కాలంలో శ్రీలంక జట్టు స్వదేశంలో పలు జట్లతో 56 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనుంది.